AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: ఇంటి తవ్వకాలలో దొరికిన వెండి నాణేలు.. కార్మికుల మధ్య పోరాటంతో పోలీసుల ఎంట్రీ

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో చోటు చేసుకున్న ఒక సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో ఒక భవనాన్ని కూల్చివేస్తున్న సమయంలో వెండి నాణేలు బయల్పడ్డాయి. ఈ వెండి నాణేల కోసం అక్కడ ఉన్న కార్మికులు ఘర్షణ పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు.

Uttar Pradesh: ఇంటి తవ్వకాలలో దొరికిన వెండి నాణేలు.. కార్మికుల మధ్య పోరాటంతో పోలీసుల ఎంట్రీ
75 Silver Coins Were Discovered
Surya Kala
|

Updated on: Sep 19, 2025 | 2:46 PM

Share

యుపీ బారాబంకి జిల్లాలోని ప్రసిద్ధ లోధేశ్వర్ మహాదేవ ప్రాంతంలో కారిడార్ నిర్మాణం కోసం ఒక ఇంటిని కూల్చివేస్తున్నారు. ఈ సమయంలో 75 వెండి నాణేలు లభించాయి. ఆ నాణేల కోసం కార్మికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పురావస్తు శాఖకు అప్పగిస్తామని తెలిపారు. గురువారం పట్టణంలోని జై నారాయణ్ గుప్తా ఇంటి పునాది నుంచి ఒక మట్టి కుండలో ఈ నాణేలు దొరికాయని పోలీసులు తెలిపారు. తవ్వకం సమయంలో నాణేలతో కుండ కనిపించిన వెంటనే కార్మికులు గొడవ పడడం మొదలు పెట్టినట్లు తెలిపారు. అక్కడ గందరగోళ సృష్టించడంతో భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారని సంఘటన స్థలంలో ఉన్న కార్మికులు తెలిపారు.

75 వెండి నాణేలు స్వాధీనం

సమాచారం అందుకున్న మహాదేవ పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జ్ అభినందన్ పాండే పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సంఘటన స్థలం నుంచి 75 వెండి నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న డిప్యూటీ తహసీల్దార్ విజయ్ ప్రకాష్ తివారీ, రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అనిల్ కుమార్ పాండే కూడా అవుట్‌పోస్ట్‌కు చేరుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నాణేలను స్వాధీనం చేసుకుని అవసరమైన కాగితపు పనిని పూర్తి చేశారు.

ఈ నాణేలను పరీక్ష కోసం పురావస్తు శాఖకు పంపుతామని ఆయన చెప్పారు. అవి క్వీన్ విక్టోరియా లేదా జార్జ్ V కాలం నాటివని భావిస్తున్నారు. కార్మికులు 75 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారని భూస్వామి హరి నారాయణ్ గుప్తా తెలిపారు.

ఇవి కూడా చదవండి

వెండి నాణేలను తమలో తాము పంచుకుంటున్న కార్మికులు

మొదట కొట్టుకున్నా.. తర్వాత కార్మికులు తమకు దొరికిన నాణేలను పంచుకోవడం ప్రారంభించారని సమాచారం. స్థానికులు ఈ విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని నాణేలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..