DRDO 2-DG: కరోనా కోసం డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం ధర ఖరారు.. ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

DRDO 2-DG: కోవిడ్‌ బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం ధర ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం. పొడి రూపంలో..

DRDO 2-DG: కరోనా కోసం డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం ధర ఖరారు.. ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Follow us

|

Updated on: May 28, 2021 | 2:25 PM

DRDO 2-DG: కోవిడ్‌ బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం ధర ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం. పొడి రూపంలో లభించే ఈ ఔషధం ఒక్కో సాకెట్‌ ధర రూ. 990గా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రం ఫార్మా కంపెనీ డిస్కౌంట్‌ ధరకు అందించనున్నట్లు తెలిపింది. అయితే ఆ డిస్కౌంట్‌ ఎంత అన్నది ఇంకా స్పష్టత రాలేదు. 2-డీజీ మందును హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌’ (ఇన్‌మాస్‌) అభివృద్ధి చేసింది. ఆక్సిజన్‌ అవసరమైన కొవిడ్‌ బాధితులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం ఎంతగానో పని చేస్తున్నట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్‌ రూపంలో ఉండే ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) ఇటీవల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ నెల 17న మొదటి విడత కింద 10వేల సాచెట్లను, మే 27న రెండో విడత కింద మరో 10వేల సాచెట్లను రెడ్డీస్‌ ల్యాబ్స్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ ఔషధాన్ని జూన్‌ మధ్యలో వాణిజ్యపరంగా ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఏడాది పాటు శ్రమించి ఔషధం తయారు..

కాగా, కరోనా కట్టడికి ఏడాది పాటు శ్రమించి ఔషధాన్ని తయారు చేశారు. గతంలో దీన్ని క్యాన్సర్‌ కోసం తయారు చేశారు. అయితే శరీరంలో క్యాన్సర్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని అప్పట్లో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే సూత్రాన్ని కొవిడ్‌కు అన్వయించుకుని పరిశోధనలు ప్రారంభించారు. శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకపోతే కణ విభజన జరగదని, ఫలితంగా శరీరంలో కరోనా వ్యాప్తి ఆగిపోతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా.. ఈ ఔషధానికి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో దీని తయారీకి మరో మూడు, నాలుగు సంస్థలకు అనుమతినివ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ కూాడా చదవండి:

Covid Vaccine Animals: ప్రపంచంలోనే తొలిసారిగా జంతువులకు కరోనా వ్యాక్సినేషన్‌.. కార్నివాక్‌ కోవ్‌ పేరిట టీకా..!

Covid-19: కోవిడ్‌-19 ఆంక్షలు జూన్‌ 30 వరకు కొనసాగించాలి.. రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ

Good News: కోవిడ్ పై పోరాటంలో మరింత పురోగతి.. కరోనా రోగులకు సరికొత్త చికిత్స.. పాజిటివ్ స్టోరీలు మీ కోసం

భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!