Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పనులు ఒంటరిగా ఎప్పుడూ చేయొద్దు..! విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?

విదురుడు మహాభారతంలోని అత్యంత తెలివైన ధర్మపరులు. ఆయన చెప్పిన విదుర నీతి జీవితంలో ఎలా జీవించాలో మార్గదర్శకంగా ఉంటుంది. కొన్ని పనులు ఒంటరిగా చేయకూడదని విదురుడు హెచ్చరిస్తున్నాడు. అలా చేస్తే అనేక సమస్యలు వస్తాయని చెబుతాడు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఈ పనులు ఒంటరిగా ఎప్పుడూ చేయొద్దు..! విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
Vidura Life Lessons
Follow us
Prashanthi V

|

Updated on: Mar 20, 2025 | 11:30 PM

మహాభారతంలో విస్తారంగా ప్రస్తావించబడిన విదురుడు జ్ఞానం, ధర్మంలో గొప్ప పండితుడు. విదుర నీతి ఒక సంపూర్ణ నీతి గ్రంథం, ఇందులో విధివిధానాలు, ఆచారాలు, ధర్మసూత్రాలు స్పష్టంగా వివరించబడ్డాయి. ఈ గ్రంథంలో మనిషి ఆచరణలో పాటించాల్సిన అనేక జీవిత మార్గదర్శకాలు ఉన్నాయి. ఇందులో కొన్ని పనులు మనం ఒంటరిగా ఎప్పుడూ చేయకూడదని చెప్పారు. ఈ పనులు ఒంటరిగా చేయడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తారు.

విదుర నీతి ప్రకారం ఒంటరిగా తినడం సత్ఫలితాలను ఇవ్వదు. భోజనం అనేది ఇతరులతో కలసి చేయడం వల్ల ఆనందం పొందగలిగేది. మీరు ఒంటరిగా తినడం అనేది మనిషి శ్రేయస్సుకు వ్యతిరేకంగా ఉంటుంది. భోజనం చేసే సమయంలో మీ చుట్టూ ఉన్నవారిని కూడా ఆహ్వానించి వారికి సహాయం చేయడం మానవత్వానికి నిదర్శనం. ఇదే కాకుండా ఇతరులతో కలిసి భోజనం చేయడం అనేది సమాజంలో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది.

విదుర నీతి మరో ముఖ్యమైన విషయం మనకు తెలియజేస్తుంది. అది ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఎలాంటి పెద్ద నిర్ణయమైనా తీసుకోవాల్సిన సందర్భంలో స్నేహితులు లేదా నమ్మకస్తులు నుండి సలహాలు తీసుకోవడం అవసరం. ఒంటరిగా తీసుకునే నిర్ణయాలు మంచివి కాకపోవచ్చు. అందుకు ఎవరైనా అనుభవజ్ఞుడి సలహా తీసుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు.

విదుర నీతి ప్రకారం మనం ఒంటరిగా మేల్కొని ఉండడం వల్ల ఆలోచనల్లో చెడు ప్రభావం పడుతుందని చెబుతారు. రాత్రిళ్లు చుట్టూ ఉన్నవారు నిద్రలో ఉన్నప్పుడు మనం ఒంటరిగా మేల్కొని ఉండకూడదు. మనసుకు, శరీరానికి విశ్రాంతి అవసరం. రాత్రిపూట నిద్ర మంచిగా లేనప్పుడు మన ఆరోగ్యానికి చెడు ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇతరులతో పాటు నిద్రపోయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

విదుర నీతి ప్రకారం నిర్జన ప్రదేశాలలో ఒంటరిగా ప్రయాణించడం ప్రమాదకరం. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు దొంగలు లేదా చెడు వ్యక్తులు దాడి చేసే అవకాశం ఉంటుంది. సమాజంలో మన రక్షణ కోసం మనం ఎల్లప్పుడూ ఒకరితో ప్రయాణించడం మంచిదని చెబుతారు. నిర్జన ప్రదేశాలలో ఒంటరిగా తిరగడం అనేది ప్రాణాలకు హాని కలిగించగలదు. కాబట్టి మీ ప్రయాణాలు ఎప్పుడూ ఇతరులతో కలిసి ఉండేలా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌