AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ చారిత్రక కట్టడాలు.. పర్యాటకుల్లో విపరీతమైన క్రేజ్..! దేశవ్యాప్తంగా టాప్ 10లో స్థానం..!

హైదరాబాద్ నగరం భారతదేశపు గొప్ప చారిత్రక సంపదను కలిగి ఉంది. ఇందులో గోల్కొండ కోట, చార్మినార్ వంటి ప్రఖ్యాత కట్టడాలు ముఖ్యమైన పర్యాటక ఆకర్షణలు. ఈ రెండు ప్రదేశాలు దేశంలోని ముఖ్యమైన చారిత్రక ప్రదేశాల జాబితాలో టాప్ 10లో స్థానం సంపాదించాయి.

హైదరాబాద్ చారిత్రక కట్టడాలు.. పర్యాటకుల్లో విపరీతమైన క్రేజ్..! దేశవ్యాప్తంగా టాప్ 10లో స్థానం..!
Hyderabad Tourism
Prashanthi V
|

Updated on: Feb 26, 2025 | 1:51 PM

Share

భారత పురావస్తు శాఖ (ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా – ఏఎస్ఐ) 2023-24 సంవత్సరానికి సంబంధించిన పర్యాటక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం గోల్కొండ కోట ఆరో స్థానం, చార్మినార్ తొమ్మిదో స్థానం పొందాయి. దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించిన ప్రదేశాల లెక్కల ఆధారంగా ఈ ర్యాంకింగ్ నిర్ణయించబడింది.

భారతదేశంలో అత్యధిక సందర్శకులను ఆకర్షించిన ప్రదేశంగా తాజ్ మహల్ మొదటి స్థానాన్ని పొందింది. 61 లక్షల మంది సందర్శకులు అక్కడికి వచ్చారు. గోల్కొండ కోట, చార్మినార్‌లు కూడా ఎంతో మంది పర్యాటకులను ఆకర్షించి ఈ జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించాయి.

తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ చారిత్రక ప్రదేశాలతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలను కూడా అందుబాటులోకి తెచ్చింది. పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రహదారులు అభివృద్ధి చేయడం, పర్యాటక సౌకర్యాలు పెంచడం, చారిత్రక కట్టడాలను సంరక్షించడం వంటివి ఈ రంగాన్ని మరింత బలోపేతం చేశాయి.

గోల్కొండ కోట, చార్మినార్ వంటి ప్రదేశాలకు మాత్రమే కాకుండా.. చిలుకూరి బాలాజీ ఆలయం, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్, శిల్పారామం వంటి ఇతర ప్రదేశాలకూ సందర్శకుల రద్దీ పెరుగుతోంది.

కరోనా మహమ్మారి కారణంగా పర్యాటక రంగం తీవ్రంగా ప్రభావితమైంది. అయితే ఇటీవల దాని ప్రభావం తగ్గడంతో హైదరాబాద్ పర్యాటక రంగం తిరిగి పురోగమిస్తోంది. 2023-24 సంవత్సరంలో గోల్కొండ కోట, చార్మినార్ కలిపి 28 లక్షల మంది సందర్శకులను ఆకర్షించాయి.

గోల్కొండ కోటను 2022-23లో 15.27 లక్షల మంది సందర్శిస్తే.. 2023-24లో ఈ సంఖ్య 16.08 లక్షలకు పెరిగింది. ఇదే విధంగా చార్మినార్‌ను 2022-23లో 9.29 లక్షల మంది సందర్శిస్తే.. 2023-24లో ఇది 12.90 లక్షలకు పెరిగింది.

గత ఏడాదితో పోల్చితే గోల్కొండ కోటకు 80 వేల మంది ఎక్కువగా వచ్చారు. చార్మినార్ సందర్శకుల సంఖ్య 3.60 లక్షల మంది పెరగడం విశేషం.

హైదరాబాద్ నగరం చారిత్రక ప్రాముఖ్యతతో పాటు రుచికరమైన వంటకాలు, సాంకేతిక పురోగతి, మౌలిక సదుపాయాల అభివృద్ధితో దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. పాత బస్తీ ప్రాంతంలోని ప్రసిద్ధ బిర్యానీ, ఇరానీ చాయ్ వంటి ప్రత్యేకతలు పర్యాటకుల ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.