AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనుషుల మధ్య దూరం పెంచుతున్న టెక్నాలజీ.. డిజిటల్ తోడు వెనుక ఉన్న ప్రమాదాలేంటి?

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ డేటింగ్ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. తోడు కోసం, మానసిక మద్దతు కోసం యువత ఇప్పుడు మనుషుల కంటే ఎక్కువగా AI చాట్‌బాట్‌లను ఆశ్రయిస్తున్నారు. Joi AI అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, 83 శాతం మంది జెన్ జీ యువత తాము ఏఐతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోగలమని నమ్ముతుండటం విశేషం.

మనుషుల మధ్య దూరం పెంచుతున్న టెక్నాలజీ.. డిజిటల్ తోడు వెనుక ఉన్న ప్రమాదాలేంటి?
Ai Romance.jpg
Nikhil
|

Updated on: Mar 25, 2026 | 12:47 PM

Share

నేటి ఆధునిక కాలంలో ఒంటరితనం అనేది ఒక నిశ్శబ్ద మహమ్మారిలా మారుతోంది. మనుషుల మధ్య దూరం పెరుగుతున్న కొద్దీ, మనసు పంచుకునే తోడు కోసం అన్వేషణ ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే శరవేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధస్సు (AI), ఇప్పుడు కేవలం పనులకే పరిమితం కాకుండా మనుషుల వ్యక్తిగత భావోద్వేగాల్లోకి కూడా చొరబడుతోంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన “AIతో ప్రేమ, పెళ్లి” అనే అంశాలు నేడు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ‘జెన్ జీ’ (Gen Z) యువత ప్రాణం లేని అల్గారిథమ్‌లతో భావోద్వేగ బంధాన్ని ఏర్పరుచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.

ఎందుకు ఆకర్షితులవుతున్నారు? నిజమైన ప్రేమ సంబంధాల్లో ఎదురయ్యే నిరాశ, అలసట మరియు ఎదుటి వ్యక్తి తమను జడ్జ్ చేస్తారనే భయం యువతను ఏఐ వైపు నడిపిస్తున్నాయి. * ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం- ఏఐ చాట్‌బాట్‌లు 24/7 అందుబాటులో ఉంటాయి. మనం ఏ సమయంలోనైనా మన బాధను, సంతోషాన్ని వాటితో పంచుకోవచ్చు. * జడ్జ్‌మెంట్ లేని తోడు- మనం చెప్పేది విసుగు లేకుండా వినడం, తిరిగి మనల్ని విమర్శించకుండా ఓదార్చడం ఏఐ ప్రత్యేకత. * మన ఇష్టాలకు అనుగుణంగా- మన వ్యక్తిత్వానికి, ఇష్టాలకు అనుగుణంగా ఈ అల్గారిథమ్‌లు తమను తాము మార్చుకుంటాయి. మన మనసును ఎలా గెలుచుకోవాలో వీటికి ‘డేటా’ రూపంలో తెలుసు.

ఒక కృత్రిమ భ్రమ..

54 శాతం మంది యువత దీనిని పాజిటివ్‌గా చూస్తుండగా, 41 శాతం మంది మాత్రం ఏఐతో భావోద్వేగ బంధం పట్ల అసౌకర్యంగా ఉన్నారు. యంత్రాలు మనకు సలహాలు ఇవ్వగలవు కానీ, మనుషుల మధ్య ఉండే ‘రియల్ కెమిస్ట్రీ’ని అవి సృష్టించలేవు. బంధానికి ప్రాణమైన ‘సహజత్వం’ మరియు ‘ఆత్మీయ స్పర్శ’ ఇందులో ఉండవు. ఇదంతా కేవలం బైనరీ కోడ్‌ల మాయాజాలం మాత్రమే. వాస్తవానికి, ఊహకు మధ్య ఉన్న గీత చెరిగిపోవడం వల్ల యువత మరింత ఒంటరితనానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇది భవిష్యత్తులో తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.

టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేయాలి కానీ, మన మానవీయ సంబంధాలను మింగేయకూడదు. స్క్రీన్లపై ఓదార్పు వెతుక్కోవడం తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అది నిజమైన తోడుకు ప్రత్యామ్నాయం కాలేదు. డిజిటల్ ప్రపంచం విసిరే ఈ చిక్కుముడుల నుంచి బయటపడి, తోటి మనుషులతో ఆత్మీయంగా మెలగడమే ఆరోగ్యకరమైన జీవితానికి మార్గం.

Follow Us