AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి పండ్లు కొంటున్నారా? అయితే జాగ్రత్త! కెమికల్స్‌లేని ఆరోగ్యకరమైన పండ్లను ఇలా గుర్తించండి..

మామిడి పండ్ల సీజన్ మొదలైందంటే చాలు.. మార్కెట్లు రంగురంగుల పండ్లతో కళకళలాడుతుంటాయి. కానీ, ఈ రంగు వెనుక ప్రమాదకరమైన రసాయనాలు దాగి ఉండవచ్చు. అధిక లాభాల కోసం మార్కెట్లోకి పండ్లను ముందే తీసుకురావాలనే ఉద్దేశంతో కాల్షియం కార్బైడ్‌ ఉపయోగించి మామిడిని పండించడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇలా కృత్రిమంగా పండించిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలి..? వాటి వల్ల కలిగే నష్టాల గురించి ప్రతి ఒక్కరూ తప్పక అవగాహన కలిగి ఉండాలి. అదేలాగంటే..

మామిడి పండ్లు కొంటున్నారా? అయితే జాగ్రత్త! కెమికల్స్‌లేని ఆరోగ్యకరమైన పండ్లను ఇలా గుర్తించండి..
Harmful Chemicals In Fruits
Jyothi Gadda
|

Updated on: May 05, 2026 | 11:15 AM

Share

వేసవి కాలం రాగానే మార్కెట్లోకి మామిడి పండ్లు వెల్లువలా వస్తాయి. అయితే, లాభాల కోసం కొంతమంది వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను ఉపయోగించి మామిడి పండ్లను కృత్రిమంగా పండిస్తున్నారు. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సహజంగా పండిన పండ్లకు, రసాయనాలతో పండించిన పండ్లకు మధ్య తేడాలను రంగు, రుచి, వాసన ద్వారా గుర్తించవచ్చు. కృత్రిమ పండ్ల వల్ల చర్మ వ్యాధులు, జీర్ణకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొనుగోలు చేసే ముందు వినియోగదారులు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం.

కృత్రిమంగా పండించిన పండ్లను ఎలా గుర్తించాలి?:

రంగులో తేడా: సహజంగా పండిన మామిడి పండు అన్ని వైపులా ఒకే రంగులో ఉండదు. అక్కడక్కడా పచ్చగా, అక్కడక్కడా పసుపు రంగులో ఉంటుంది. కానీ రసాయనాలతో పండిన పండు పూర్తిగా నిగనిగలాడుతూ, ఒకే విధమైన పసుపు రంగులో కనిపిస్తుంది.

వాసన: సహజంగా పండిన పండును ముక్కు దగ్గర పెట్టుకుంటే మంచి సువాసన వస్తుంది. కృత్రిమ పండ్లకు అసలు వాసన ఉండదు, లేదా ఒక రకమైన రసాయన వాసన వస్తుంది.

ఇవి కూడా చదవండి

నీటి పరీక్ష: ఒక గిన్నెలో నీటిని తీసుకుని మామిడి పండ్లను అందులో వేయండి. సహజంగా పండిన పండ్లు నీటిలో మునుగుతాయి. కానీ కృత్రిమంగా పండిన పండ్లు నీటిపై తేలుతాయి.

రుచి, గుజ్జు: రసాయనాలతో పండించిన పండు పైన పసుపుగా ఉన్నా, లోపల గుజ్జు తెల్లగా లేదా లేత రంగులో ఉంటుంది. తిన్నప్పుడు గొంతులో మంటగా అనిపించవచ్చు.

ఇలాంటి రసాయనాలు, కార్బైడ్ వంటి కెమికల్స్‌ వాడటం వల్ల శరీరంలోకి ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి విషపూరిత మూలకాలు చేరుతాయి. దీనివల్ల వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పండ్లను కొన్న తర్వాత వెంటనే తినకుండా, కనీసం రెండు గంటల పాటు ఉప్పు కలిపిన నీటిలో ఉంచి శుభ్రంగా కడగాలి. వీలైనంత వరకు నమ్మకమైన రైతుల దగ్గర లేదా సేంద్రియ (Organic) పద్ధతిలో పండించిన పండ్లనే ఎంచుకోవాలి. పండు తొక్కను తీసేసి తినడం వల్ల రసాయనాల ప్రభావం కొంత తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. కాబట్టి మామిడి పండ్లను కొనేటప్పుడు కేవలం రంగును చూసి మోసపోకుండా, పైన చెప్పిన చిట్కాలను పాటించి నాణ్యమైన పండ్లను ఎంచుకోండి. వినియోగదారుల అప్రమత్తతే వారి ఆరోగ్యానికి రక్ష.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర