AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? వామ్మో.. ఈ సమస్యలుంటే గుండెపోటు వస్తుందట జాగ్రత్త..

చలికాలంలో చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తారు.. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా చేస్తుంటారు.. అయితే.. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఉల్లాసంగా అనిపిస్తుంది.. శారీరకంగా ఓదార్పునిస్తుంది. ఈ క్రమంలో మీరు, బీపీ లేదా హార్ట్ పేషెంట్ అయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.. లేకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? వామ్మో.. ఈ సమస్యలుంటే గుండెపోటు వస్తుందట జాగ్రత్త..
Hot Bathing
Shaik Madar Saheb
|

Updated on: Dec 02, 2024 | 9:45 AM

Share

చలి విజృంభిస్తోంది.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. అయితే, శీతాకాలంలో స్నానం చేయడానికి వేడి నీటిని ఉపయోగించడం చాలా సౌకర్యవంతమైన ఎంపిక.. ఈ అలవాటు శారీరక సౌఖ్యాన్ని అందించడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హృద్రోగులకు స్నానం చేసే నీటి ఉష్ణోగ్రత సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఏ రకమైన నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి ప్రయోజనకరం.. ఎలాంటి తప్పులు చేయకూడదు.. అనే విషయాలను తెలుసుకోవడం చాలామంచిది. కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు వేడినీటితో స్నానం చేయడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు.. ఇలాంటి పరిస్థితుల్లో వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకోండి..

వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..

వేడి నీటితో స్నానం చేయడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది. ఇది శారీరక ఉపశమనాన్ని అందిస్తుంది.

ఇది కాకుండా, ఇది శరీర రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. దీని కారణంగా ఆక్సిజన్, పోషకాలు అన్ని శరీర భాగాలకు సరిగ్గా చేరుతాయి.

వేడి నీరు చర్మ రంధ్రాలను తెరుస్తుంది.. మురికిని బయటకు తీస్తుంది.. తద్వారా చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం మొత్తం ఉపశమనం పొందుతుంది.. ఇది దృఢత్వం, నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు

వేడి నీరు చర్మం సహజ తేమను తొలగిస్తుంది. దీని వలన చర్మం పొడిబారుతుంది. చికాకు, దురద లేదా పగుళ్లు ఏర్పడవచ్చు.

వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, బీపీ పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే బిపి లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ప్రాణాంతకం..

కొందరికి బాగా వేడి నీళ్లతో స్నానం చేసిన తర్వాత తల తిరగడం కూడా అనిపించవచ్చు.. ఎందుకంటే శరీరం బలహీనంగా, అలసటగా అనిపిస్తుంది.

తలనొప్పి, డీహైడ్రేషన్, వికారం, మూర్ఛపోవడం లాంటి సమస్యలను కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది..

సరైన నీటి ఉష్ణోగ్రత ముఖ్యం..

శీతాకాలంలో స్నానం చేయడానికి నీటి ఉష్ణోగ్రత చాలా చల్లగా లేదా చాలా వేడిగా ఉండకూడదు. గోరువెచ్చని నీరు ఉత్తమ ఎంపిక.. ఇది సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చర్మం, బిపిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మీరు వేడి నీటితో స్నానం చేస్తుంటే, స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ను సరిగ్గా అప్లై చేయడం కూడా ముఖ్యం.. తద్వారా చర్మం తేమగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..