AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైసూర్ వీధుల్లో మన్నారా చోప్రా సందడి! ‘మైసూర్ మసాలా దోశ’, మైసూర్ పాక్ రుచికి ఫిదా

మైసూర్ ఫ్యాషన్ వీక్ సీజన్ 8లో డిజైనర్ రోజీ అహ్లువాలియా తరపున షోస్టాపర్‌గా వ్యవహరించిన మన్నారా చోప్రా, ఆ తర్వాత తన ఫుడ్ క్రేవింగ్స్‌ను తీర్చుకున్నారు. "మైసూర్ వచ్చి మసాలా దోశ, మైసూర్ పాక్ తినకపోతే ఇంకేం చేసినట్లు?" అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో సందడి చేశారు.

మైసూర్ వీధుల్లో మన్నారా చోప్రా సందడి! ‘మైసూర్ మసాలా దోశ’, మైసూర్ పాక్ రుచికి ఫిదా
Mannara Chopra
Nikhil
|

Updated on: Mar 24, 2026 | 8:25 AM

Share

మైసూర్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి ప్యాలెస్ అందాలు, సుగంధ పరిమళాలు. కానీ, ఒక ఫుడ్ లవర్ దృష్టిలో మైసూర్ అంటే అది కేవలం ఒక నగరం కాదు, రుచికరమైన ‘మైసూర్ మసాలా దోశ’, నోట్లో వేసుకోగానే కరిగిపోయే ‘మైసూర్ పాక్’కు కేరాఫ్ అడ్రస్. ఇటీవల నటి మన్నారా చోప్రా కూడా ఇదే విషయాన్ని నిరూపించారు. మైసూర్ ఫ్యాషన్ వీక్‌లో షోస్టాపర్‌గా మెరిసిన ఈ బ్యూటీ, రాంప్ వాక్ ముగియగానే నేరుగా మైసూర్ లోకల్ ఫుడ్ రుచుల్లో మునిగిపోయారు. ఆ విశేషాలతో పాటు, ఇంట్లోనే హోటల్ స్టైల్ మైసూర్ మసాలా దోశ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

  •  ఒకరోజు మొత్తం డైటింగ్‌లో ఉన్న మన్నారా, షో ముగియగానే వేడివేడి క్రిస్పీ మైసూర్ మసాలా దోశను కొబ్బరి చట్నీతో ఆస్వాదించారు. “లోకల్ ఫుడ్ ఇస్ ద బెస్ట్ ఫుడ్” అంటూ ఆమె ఇచ్చిన రివ్యూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత నెయ్యితో నిండిన మైసూర్ పాక్ తింటూ, దాని మృదుత్వాన్ని చూసి మురిసిపోయారు.</
    View this post on Instagram

    A post shared by Mannara Chopra (@memannara)

    li>

‘మైసూర్ మసాలా దోశ’ – తయారీ విధానం..

మన్నారా తిన్న ఆ రుచికరమైన దోశను మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ రెసిపీ మీకోసం.

కావలసిన పదార్థాలు

  • దోశ పిండి- 2 కప్పుల బియ్యం, 1 కప్పు మినపప్పు, అర కప్పు అటుకులు (వీటిని నానబెట్టి, రుబ్బి, రాత్రంతా పులియబెట్టాలి).
  • రెడ్ చట్నీ (ముఖ్యమైనది)- 10-12 ఎండుమిర్చి, 6-7 వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతపండు ముక్క, ఉప్పు.
  • ఆలు మసాలా- ఉడికించిన బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, తాలింపు దినుసులు.

తయారీ పద్ధతి..

  1.  రెడ్ చట్నీ- ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండును కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
  2. మసాలా- పాన్‌లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు వేయించాలి. అందులో పసుపు, ఉప్పు, ఉడికించిన ఆలుగడ్డలు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  3. దోశ వేయడం- వేడి పెనంపై దోశ పిండిని పల్చగా పోయాలి. దోశ కొంచెం వేడెక్కగానే పైన మనం చేసుకున్న రెడ్ చట్నీని అంతటా పూయాలి.
  4. మధ్యలో ఆలు మసాలా ఉంచి, దోశ ఎర్రగా కాలిన తర్వాత మడతపెట్టి తీయాలి.

మైసూర్ మసాలా దోశలోని ఆ ప్రత్యేకమైన రెడ్ చట్నీ రుచి, మైసూర్ పాక్ తియ్యదనం ఎవరినైనా కట్టిపడేస్తాయి. మన్నారా చోప్రా లాగా మీరు కూడా ఈ వీకెండ్‌లో లోకల్ రుచులను ఆస్వాదించండి లేదా ఇంట్లోనే ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి!

Follow Us