Soaked Dates: ఖర్జూరాలను ఇలా నానబెట్టి తింటే.. బంపర్ బెనిఫిట్స్..! తెలిస్తే వెంటనే మొదలుపెట్టేస్తారు..
పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తినడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి. ముఖం మెరుస్తుంది. పాలలో నానబెట్టిన ఖర్జూరం తినటం వల్ల పొటాషియం అధికంగా లభిస్తుంది. దీని రక్తపోటును నియంత్రించవచ్చు. దీనితో పాటు, పెరిగిన కొలెస్ట్రాల్ నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. పోషకాలు అధికంగా ఉండే ఖర్జూరాన్ని పాలతో కలిపి తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు.

ఖర్జూరాలు అనేక పోషకాలను కలిగి ఉన్న డ్రై ఫ్రూట్స్. అవి చూడటానికి చిన్నగా కనిపించినప్పటికీ, వాటిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ఖర్జూరలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B 2, B3, B5 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే వివిధ రకాల అమైనో ఆమ్లాలతో పాటు సెలీనియం, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాలను కొందరు నీళ్లలో నానబెట్టి తింటారు. మరికొందరు పాలలో నానబెట్టి తింటూ ఉంటారు. అయితే, ఎలా తినడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది? ఇక్కడ తెలుసుకుందాం:
నీటికి బదులుగా పాలలో నానబెట్టిన ఖర్జూరాలు తినడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12 మరియు అనేక ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, సహజ చక్కెర, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే అనేక ఇతర ఖనిజాలు ఉంటాయి. ఖర్జూరాన్ని పాలలో నానబెట్టి తినేటప్పుడు, దాని పోషకాలు పాలలో కలిసిపోతాయి. దాని ప్రయోజనాలు పెరుగుతాయని చెబుతున్నారు.
పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తినడం వల్ల ఎముకలు బలపడతాయి. ఇది పిల్లలు, వృద్ధులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. పాలలో నానబెట్టిన జీర్ణ ఫైబర్ అధికంగా ఉండే ఖర్జూరాన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. దీని వినియోగం మలబద్ధకం, అజీర్ణం, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఖర్జూరాలలో మంచి మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. పాలలో నానబెట్టి తాగడం వల్ల అలసట, బలహీనత నుండి ఉపశమనం లభిస్తుంది. కేలరీలు, పోషకాలు అధికంగా ఉండే పాలు, ఖర్జూరాలు తీసుకోవడం వల్ల బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. తక్కువ బరువు ఉండి బరువు పెరగాలనుకునే వారు పాలలో నానబెట్టిన ఖర్జూరాలు తినవచ్చు అంటున్నారు నిపుణులు.
పాలు, ఖర్జూరం రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తినడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి. ముఖం మెరుస్తుంది. పాలలో నానబెట్టిన ఖర్జూరం తినటం వల్ల పొటాషియం అధికంగా లభిస్తుంది. దీని రక్తపోటును నియంత్రించవచ్చు. దీనితో పాటు, పెరిగిన కొలెస్ట్రాల్ నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. పోషకాలు అధికంగా ఉండే ఖర్జూరాన్ని పాలతో కలిపి తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..