అతిగా పండిన అరటిపండ్లు నల్లబడ్డాయని పారేస్తున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Mar 24, 2023 | 4:45 PM

తరచుగా కండరాల నొప్పితో ఇబ్బంది పడుతుంటే, మీరు ఎక్కువగా పండిన అరటిపండ్లను తినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది కండరాల నొప్పి, తిమ్మిరి నుండి ఉపశమనం అందిస్తుంది.

అతిగా పండిన అరటిపండ్లు నల్లబడ్డాయని పారేస్తున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
Overripe Bananas
Follow us

యాపిల్ తర్వాత, రోజూ తింటే ఆరోగ్యానికి మంచిదని భావించే ఏకైక పండు అరటిపండు. ఎందుకంటే అరటిపండులో విటమిన్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం మరియు పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంది పచ్చి అరటికాయలను వండుకుని తింటారు. అయితే, అరటిపండు ఎక్కువగా పండినప్పుడు, దాని పై తొక్క రంగు నలుపు రంగులోకి మారడం తరచుగా చూస్తుంటాం. అటువంటి పరిస్థితిలో చాలా మంది ప్రజలు ఆ అరటిపండు పాడైపోయిందని కుళ్ళిపోయినట్లుగా భావించి చెత్తలో వేస్తారు. అయితే అతిగా పండిన అరటిపండ్లను పారేయకుండా తింటే ఎన్ని లాభాలో తెలుసా?

అతిగా పండిన అరటిపండ్లలో ఎక్కువ ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా, నలుపు లేదా గోధుమ రంగులోకి మారిన అరటిపండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుండి బయటపడటానికి మీకు సహాయపడుతుంది. మీరు ఎక్కువగా పండిన అరటిపండును అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. అతిగా పండిన అరటిపండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1. కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది: అతిగా పండిన అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బాగా పండిపోయినట్టుగా భావించే అరటిపండ్లు నలుపు, గోధుమరంగులోకి తొక్కలు మారిపోతాయి. అయితే, అలాంటి పండ్లను ఎక్కువగా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంలో సహాయపడుతుంది. ఇది అనేక వ్యాధుల నుండి కూడా కాపాడుతుంది. అంతే కాదు కణాలకు ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

2. గుండెకు మేలు చేస్తుంది: అతిగా పండిన అరటిపండ్లు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అతిగా పండిన అరటిపండ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం నుండి రక్షించడానికి పనిచేస్తుంది.

3. సులభంగా జీర్ణం అవుతుంది: అతిగా పండిన అరటిపండ్లలో ఉండే స్టార్చ్ ఫ్రీ షుగర్‌గా మారుతుంది. ఇవి తేలికగా జీర్ణం కావడానికి ఇదే కారణం. వీటిని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు పండిన అరటిపండ్లను ఎక్కువగా తినాలి.

4. క్యాన్సర్‌ను నివారించడంలో ఉపయోగపడుతుంది: అరటిపండు నలుపు లేదా గోధుమ తొక్కలో ఒక ప్రత్యేక రకం పదార్థం ఉంటుంది. దీనిని ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అంటారు. క్యాన్సర్ కణాలు, ఇతర ప్రమాదకరమైన కణాలు పెరగకుండా నిరోధించడానికి ఇది పనిచేస్తుంది.

5. కండరాల నొప్పి నుండి ఉపశమనం: మీరు తరచుగా కండరాల నొప్పితో ఇబ్బంది పడుతుంటే, మీరు ఎక్కువగా పండిన అరటిపండ్లను తినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది కండరాల నొప్పి, తిమ్మిరి నుండి ఉపశమనం అందిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu