అక్రమ నిర్మాణాలపై న్యాయపోరాటం చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే

తమ పార్టీ ధర్మానికి, న్యాయానికి కట్టుబడి ఉంటుందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రజావేదిక సమీపంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి.. నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని తాను కోర్టును ఆశ్రయించానన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకి ప్రజలు బుద్ది చెప్పినా.. చట్టాలని, న్యాయవ్యవస్థలను మానేజ్ చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిని తాను వదలబోనని.. న్యాయ పోరాటం చేస్తానని తేల్చిచెప్పారు. చట్టానికి […]

అక్రమ నిర్మాణాలపై న్యాయపోరాటం చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 26, 2019 | 10:38 AM

తమ పార్టీ ధర్మానికి, న్యాయానికి కట్టుబడి ఉంటుందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రజావేదిక సమీపంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి.. నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని తాను కోర్టును ఆశ్రయించానన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకి ప్రజలు బుద్ది చెప్పినా.. చట్టాలని, న్యాయవ్యవస్థలను మానేజ్ చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిని తాను వదలబోనని.. న్యాయ పోరాటం చేస్తానని తేల్చిచెప్పారు. చట్టానికి లోబడి ప్రభుత్వం పనిచేయాలన్నారు.