కాసేపట్లో ప్రధాని మోడీతో అమెరికా విదేశాంగ మంత్రి భేటీ
భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత ఉన్నతస్థాయి చర్చల కోసం విదేశీ నుంచి ఓ మంత్రి రావడం ఇదే మొదటిసారి. మోదీతో పాటు భారతదేశ నూతన విదేశాంగ మంత్రి జైశంకర్తోనూ పాంపియో భేటీ కానున్నారు. ఉగ్రవాదం, హెచ్-1బీ వీసా, ఇరాన్ చమురు పై అమెరికా ఆంక్షలతో భారత్లో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు […]
భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత ఉన్నతస్థాయి చర్చల కోసం విదేశీ నుంచి ఓ మంత్రి రావడం ఇదే మొదటిసారి. మోదీతో పాటు భారతదేశ నూతన విదేశాంగ మంత్రి జైశంకర్తోనూ పాంపియో భేటీ కానున్నారు. ఉగ్రవాదం, హెచ్-1బీ వీసా, ఇరాన్ చమురు పై అమెరికా ఆంక్షలతో భారత్లో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించనున్నారు.