AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రఘురామకృష్ణంరాజుకు దిమ్మతిరిగే షాక్.!

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఝలక్ ఇచ్చింది. ఇటీవల కొంతకాలంగా బహిరంగంగా పార్టీమీద వ్యతిరేకవాణిని వినిపిస్తోన్న ఎంపీకి దిమ్మతిరిగే ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్న ఆపార్టీ అధినాయకత్వం కొంతకాలంగా ఆదిశగా పావులు కదుపుతోంది. తాజాగా రఘురామను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించారు. రఘురామకృష్ణరాజు స్థానంలో వైసీపీ ఎంపీ బాలశౌరికి అవకాశం ఇచ్చారు. దీంతో ఇంతకాలం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేచర్ కి చైర్మన్ గా […]

రఘురామకృష్ణంరాజుకు దిమ్మతిరిగే షాక్.!
Raghu ramakrishna raju
Venkata Narayana
|

Updated on: Oct 16, 2020 | 6:48 PM

Share

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఝలక్ ఇచ్చింది. ఇటీవల కొంతకాలంగా బహిరంగంగా పార్టీమీద వ్యతిరేకవాణిని వినిపిస్తోన్న ఎంపీకి దిమ్మతిరిగే ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్న ఆపార్టీ అధినాయకత్వం కొంతకాలంగా ఆదిశగా పావులు కదుపుతోంది. తాజాగా రఘురామను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించారు. రఘురామకృష్ణరాజు స్థానంలో వైసీపీ ఎంపీ బాలశౌరికి అవకాశం ఇచ్చారు. దీంతో ఇంతకాలం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేచర్ కి చైర్మన్ గా వ్యవహరించిన రఘురామకృష్ణరాజు ఆ పదవి కోల్పోయినట్లైంది. అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని లోక్ సభ సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది.