వైఎస్ వివేకాది హత్యే: పోలీసులు
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యేనని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు. ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టే నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. వివేకా శరీరంపై ఏడు పదునైన కత్తి గాట్లు ఉన్నాయి. నుదుటిపై రెండు లోతైన గాయాలు, తల వెనుక మరో గాయం, తొడ భాగంలో, చేతిపై మరో గాయం ఉంది. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్వాడ్ పరిశీలించాయి. ఇంట్లో వేలిముద్రలు, పాదముద్రలను సేకరించారు. రిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఈ పోస్టుమార్టం […]
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యేనని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు. ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టే నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.
వివేకా శరీరంపై ఏడు పదునైన కత్తి గాట్లు ఉన్నాయి. నుదుటిపై రెండు లోతైన గాయాలు, తల వెనుక మరో గాయం, తొడ భాగంలో, చేతిపై మరో గాయం ఉంది.
ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్వాడ్ పరిశీలించాయి. ఇంట్లో వేలిముద్రలు, పాదముద్రలను సేకరించారు.
రిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఈ పోస్టుమార్టం జరిగింది. మరికాసేపట్లో రిమ్స్ వైద్యులు ఈ సంఘటనపై ప్రత్యేక నివేదిక ఇవ్వనున్నారు. పోస్ట్ మార్టం పూర్తి కావడంతో వివేకా భౌతికకాయాన్ని బంధువులు నివాసానికి తరలించారు. రేపు పులివెందులలో అంత్యక్రియలు జరగనున్నాయి. వివేకా మరణ వార్త తెలుసుకున్న జగన్ హైదరాబాద్ నుంచి బయల్దేరారు.
ఇదిలా ఉంటే వివేకా మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ పార్టీ డిమాండ్ చేస్తోంది. పెద్దనాన్న మృతిపై అనేక అనుమానాలనున్నాయని, ఆయనది సహజ మరణం కాదని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వివేకా మృతిపై సిట్ను ఏర్పాటు చేసింది. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్వాడ్ పరిశీలించాయి. ఇంట్లో వేలిముద్రలు, ఫుట్ ప్రింట్స్ సేకరించారు. దోషులు ఎంతటివారైనా పట్టుకుంటామని కడప జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ చెప్పారు.