కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు..!
కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలయ్యింది.. మంత్రి అనిల్కు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్కు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎమ్మెల్యే ఆర్ధర్ అనుచరులు బహిరంగంగానే నీటిపారుదల శాఖ మంత్రి
కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలయ్యింది.. మంత్రి అనిల్కు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్కు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎమ్మెల్యే ఆర్ధర్ అనుచరులు బహిరంగంగానే నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నందికొట్కూరు రాజకీయాలలో జోక్యం చేసుకుంటే కర్నూలులో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. నేరస్తులు, హంతకులకు భయపడేవారెవ్వరూ ఇక్కడ లేరన్నారు. అనిల్ ఎక్కడ కనిపించినా అడ్డగిస్తామన్నారు ఆర్థర్ అనుచరులు.
ఈ హెచ్చరికలన్నీ ఆర్థర్ సమక్షంలోనే కార్యకర్తలు చేయడం గమనార్హం… నందికొట్కూరు రాజకీయాలను పార్టీ అధిష్టానం నిశితంగా గమనిస్తోంది.. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఆర్థర్కు సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మధ్య మొదట్నుంచి విభేదాలున్నాయి. విద్యా వాలంటీర్ల నియామకం మొదలు ఇప్పటి వరకు అనేక విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి.
తాజాగా నందికొట్కూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ నియామకం విషయంలో కూడా ఆర్థర్- సిద్ధార్థ్రెడ్డి గొడవ పడ్డారు. కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అనిల్కుమార్ ..సిద్ధార్థ్రెడ్డి పక్షం వహిస్తున్నారన్నది ఆర్థర్ వర్గం ప్రధాన ఆరోపణ. అందుకే గత కొద్ది రోజులుగా అనిల్పై ఆర్థర్ అనుచరులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇరువర్గాల మధ్య విభేదాలు పీక్కు చేరాయి… మరి అధిష్టానం ఇద్దరి మధ్య ఎలా సయోధ్య కుదిరిస్తుందో చూడాలి మరి.