AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోటి రూపాయల కట్నమిచ్చినా.. ఉసురు తీశారు

వరకట్నం వేధింపులకు మరో ఇల్లాలు బలైంది. ఎన్నారై భర్త అని ఆశపడి పెళ్లి చేసుకుంటే.. వరకట్నం వేధింపులతో ఆమె ఉసురు తీశారు అత్తింటి వారు. హైదరాబాద్ రామంతపూర్‌కు చెందిన జువాడి శ్రీలత.. వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. ముంబైలోని తన మేనమామ ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రామాంతపూర్‌కు చెందిన శ్రీలతకు, యూకేలో ఉంటోన్న వంశీరావుతో 2011లో వివాహం జరిగింది. ఆ సమయంలో కట్నం కింద కోటి రూపాయలు, 55 తులాల బంగారాన్ని శ్రీలత […]

కోటి రూపాయల కట్నమిచ్చినా.. ఉసురు తీశారు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 08, 2019 | 1:17 PM

Share

వరకట్నం వేధింపులకు మరో ఇల్లాలు బలైంది. ఎన్నారై భర్త అని ఆశపడి పెళ్లి చేసుకుంటే.. వరకట్నం వేధింపులతో ఆమె ఉసురు తీశారు అత్తింటి వారు. హైదరాబాద్ రామంతపూర్‌కు చెందిన జువాడి శ్రీలత.. వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. ముంబైలోని తన మేనమామ ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రామాంతపూర్‌కు చెందిన శ్రీలతకు, యూకేలో ఉంటోన్న వంశీరావుతో 2011లో వివాహం జరిగింది. ఆ సమయంలో కట్నం కింద కోటి రూపాయలు, 55 తులాల బంగారాన్ని శ్రీలత తల్లిదండ్రులు ఇచ్చారు. 2012లో వంశీ, శ్రీలతను యూకేకు తీసుకెళ్లగా.. అక్కడ ఈ ఇద్దరు సాఫ్ట్‌వేర్ జాబ్‌లు చేస్తూ వచ్చారు. కొద్దిరోజులు వీరి కాపురం సజావుగా సాగినా.. ఆ తరువాత కట్నం వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే శ్రీలత పాపకు జన్మనివ్వగా.. అప్పటినుంచి అత్తింటివారు ఆమెను మరింతగా వేధిస్తూ వచ్చారు.

ఈ నేపథ్యంలో 2018లో యూకేలో ట్రైన్ దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది శ్రీలత. అయినా వంశీరావులో మార్పు రాలేదు. కాగా 2018 జూన్‌లో యూకే నుంచి శ్రీలత, భర్త వంశీరావు, పాపతో హైదరాబాద్‌‌కు వచ్చారు. అయితే శ్రీలత, పాపను ఇక్కడే వదిలేసి, వంశీరావు యూకేకు తిరిగి వెళ్లిపోయాడు. ఇక ఇక్కడే అత్తింట్లో ఉన్న శ్రీలతకు వారి వద్ద నుంచి రోజూ వేధింపులు ఉండటంతో.. ముంబైలోని తన మేనమామ ఇంటికి వెళ్లి ఆమె ఆత్మహత్య చేసుకుంది.

మరోవైపు శ్రీలతను పొట్టనబెట్టుకున్న భర్త వంశీరావు, అత్తామామలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. వారి ఇంటి ముందు ఐద్వా మహిళా సంఘం నేతలు ఆందోళనకు దిగారు. శ్రీలత పాపకు న్యాయం జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మాట్లాడిన మల్కాజ్‌గిరి ఏసీపీ సందీప్ రావు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శ్రీలత ఆత్మహత్య తరువాత ఇంటికి తాళం వేసి ఆమె అత్తామామలు పరారయ్యారని, వారి కోసం గాలింపు చేపట్టామని పేర్కొన్నారు.

అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !