AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నైలో తీవ్ర నీటి సంక్షోభం!

దక్షిణాది రాష్ట్రాలలోని అన్ని రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు ఇప్పటికే కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ రాష్ట్రాలలో తమిళనాడు పరిస్థితి మరింత అద్వానంగా ఉంది. తమిళనాడు లోని జలాశయాలలో నీటి మట్టాలు సాధారణం కన్నా 99 శాతం తక్కువగా ఉన్నాయి. కేంద్ర వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసి) గణాంకాల ప్రకారం తమిళనాడు తరువాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. దాదాపు 48 శాతం నీటి కొరతతో ఏపీ కరవు ముంగిట నిలిచింది. కర్నాటక కేరళ జలాశయాల్లో సాధారణం […]

చెన్నైలో తీవ్ర నీటి సంక్షోభం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 03, 2019 | 5:31 PM

Share

దక్షిణాది రాష్ట్రాలలోని అన్ని రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు ఇప్పటికే కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ రాష్ట్రాలలో తమిళనాడు పరిస్థితి మరింత అద్వానంగా ఉంది. తమిళనాడు లోని జలాశయాలలో నీటి మట్టాలు సాధారణం కన్నా 99 శాతం తక్కువగా ఉన్నాయి. కేంద్ర వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసి) గణాంకాల ప్రకారం తమిళనాడు తరువాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. దాదాపు 48 శాతం నీటి కొరతతో ఏపీ కరవు ముంగిట నిలిచింది. కర్నాటక కేరళ జలాశయాల్లో సాధారణం కన్నా 37శాతం తక్కువగా నీటి నిల్వలు ఉన్నాయి.

తమిళనాడుకు నాలుగు ప్రాధమిక జలాశయాల నుండి నీరు లభిస్తుంది. కానీ ఈ రిజర్వాయర్లలో నీటి మట్టాలు ఇప్పటికే కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆదివారం నాటికి, రెడ్ హిల్స్, పూండి, చోలవరం మరియు చెమ్బరంబాక్కం వద్ద నాలుగు రిజర్వాయర్లలో మొత్తం నిల్వ స్థాయి కేవలం 58 mcft (మిలియన్ క్యూబిక్ అడుగులు) – వాటి మిళిత సామర్థ్యం కంటే తక్కువగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో, నాలుగు జలాశయాలు 2.8 టిఎంసిల (వేల మిలియన్ క్యూబిక్ అడుగుల) నీటిని కలిగివున్నాయి.

చెన్నైలో ఇంకిపోతున్న జలవనరులపై నగర మెట్రో వాటర్ సప్లయ్ అండ్ సేవరేజ్ బోర్డు సీనియర్ అధికారి మాట్లాడుతూ.. చెన్నై నగర రిజర్వాయర్లు ప్రమాద స్థాయికి అడుగంటిపోతున్నాయి. వీరనం చెరువులో నీటిమట్టం స్థాయి బాగానే ఉందన్నారు. ఈ చెరువు నుండి 180 ఎంఎల్ డీ నీటిని సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. నగరంలో ప్రస్తుతం పీక్ సీజన్ లో 830ఎంఎల్ డీ వరకు నీటి అవసరం అవుతోంది. దీన్ని బోర్డు 550ఎంఎల్ డీ (రోజుకు మిలియన్ లీటర్ల నీళ్లు) కి తగ్గించింది. రానున్న రోజుల్లో 500ఎంఎల్ డీ వరకు తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. చెన్నైలో నీటి కొరత అంత అధ్వానంగా లేదన్నారు. వర్షంపై ఆధారపడకుండా.. ప్రస్తుతం నగరంలో 480 ఎంఎల్ డీ నీటిని సరఫరా చేస్తున్నట్టు చెప్పారు.