విరాట్ కోహ్లీకి గాయం.. ధావన్‌కు పగ్గాలు.?

|

Jan 05, 2020 | 11:29 AM

శ్రీలంకతో మొదలుకానున్న టీ20 సిరీస్‌ ముందే టీమిండియాకు గాయాల బెడద పట్టుకుంది. నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని చేతి వేలుకు గాయం అయింది. ఇక ఆ తర్వాత జరిగిన ప్రాక్టీస్‌ సెక్షన్స్‌లో కోహ్లీ కనిపించలేదు. దీంతో అతడు ఈ మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై సందిగ్దత ఏర్పడింది. ప్రస్తుతం వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జట్టుకు అందుబాటులో లేదు. దీంతో ఒకవేళ కోహ్లీ గాయం […]

విరాట్ కోహ్లీకి గాయం.. ధావన్‌కు పగ్గాలు.?
Follow us on

శ్రీలంకతో మొదలుకానున్న టీ20 సిరీస్‌ ముందే టీమిండియాకు గాయాల బెడద పట్టుకుంది. నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని చేతి వేలుకు గాయం అయింది. ఇక ఆ తర్వాత జరిగిన ప్రాక్టీస్‌ సెక్షన్స్‌లో కోహ్లీ కనిపించలేదు. దీంతో అతడు ఈ మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై సందిగ్దత ఏర్పడింది.

ప్రస్తుతం వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జట్టుకు అందుబాటులో లేదు. దీంతో ఒకవేళ కోహ్లీ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైతే.. ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2018 నిదహాస్ ట్రోఫీకి మొదటిసారిగా వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అతడు.. ఆసియా కప్ 2018కి కూడా రోహిత్ డిప్యూటీగా బాధ్యతలు చేపట్టాడు.

అటు కోహ్లీ స్థానంలో మనీష్ పాండే తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు చాలా రోజుల వ్యవధి తర్వాత యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌తో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. చూడాలి మరి టీమిండియా కొత్త సంవత్సరాన్ని విజయంతో ప్రారంభిస్తుందో లేదో అని..