కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. ఇక వారిపై దాడి చేస్తే జైలు, భారీ జరిమానా
కోవిద్-19 విజృంభిస్తున్న తరుణంలో.. వైద్య సిబ్బందిపై దాడులు అరికట్టేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వివరించారు. ఈ క్రమంలో 1897నాటి ది ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్లో సవరణలు
కోవిద్-19 విజృంభిస్తున్న తరుణంలో.. వైద్య సిబ్బందిపై దాడులు అరికట్టేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వివరించారు. ఈ క్రమంలో ప్రభుత్వం 1897నాటి ది ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్లో సవరణలు చేసింది. ఆర్డినెన్స్ ప్రకారం సవరణల్లో.. డాక్టర్లపై దాడులు చేసినవారికి 6 నెలల నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించాలని పేర్కొంది. జైలు శిక్షతో పాటు రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా కూడా విధించనుంది. ఆస్పత్రి ఆస్తులు ధ్వంసం చేస్తే మార్కెట్ విలువకు రెట్టింపు జరిమానా వసూలు చేయనుంది. వైద్యుల నుంచి ఆశా వర్కర్ల వరకు, వైద్య రంగ సిబ్బంది అందరికీ రూ. 50 లక్షల బీమా కూడా ప్రకటించింది.
[svt-event date=”22/04/2020,3:33PM” class=”svt-cd-green” ]
Amendment to be made to Epidemic Diseases Act, 1897 and Ordinance will be implemented. Such crime will now be cognizable & non-bailable. Investigation will be done within 30 days. Accused can be sentenced from 3 months-5 yrs & penalised from Rs 50,000 upto Rs 2 Lakh: P Javadekar https://t.co/x3B5vjYZ8s
— ANI (@ANI) April 22, 2020
[/svt-event]