AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకలో కాంగ్రెస్ మహిళా నేత దారుణ హత్య

కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.  విజయపుర జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రేష్మా పడకనూర్  హత్యకు గురయ్యారు. విజయపుర జిల్లా జేడీఎస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించిన రేష్మా… ఆ తర్వాత పదవి నుంచి తప్పుకున్నారు. గురువారం తెలిసిన వ్యక్తితో కలిసి తన కారులో బయటికి వెళ్లింది రేష్మా. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లింది? ఏమైంది? అనే వివరాలు తెలియరాలేదు. కోల్హాపూర్ సమీపంలో ఉన్న కృష్ణ నదీ తీరంలో రేష్మ శవమై కనిపించింది. ఆమెను […]

కర్ణాటకలో కాంగ్రెస్ మహిళా నేత దారుణ హత్య
Ram Naramaneni
|

Updated on: May 17, 2019 | 6:10 PM

Share

కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.  విజయపుర జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రేష్మా పడకనూర్  హత్యకు గురయ్యారు. విజయపుర జిల్లా జేడీఎస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించిన రేష్మా… ఆ తర్వాత పదవి నుంచి తప్పుకున్నారు. గురువారం తెలిసిన వ్యక్తితో కలిసి తన కారులో బయటికి వెళ్లింది రేష్మా. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లింది? ఏమైంది? అనే వివరాలు తెలియరాలేదు. కోల్హాపూర్ సమీపంలో ఉన్న కృష్ణ నదీ తీరంలో రేష్మ శవమై కనిపించింది. ఆమెను దారుణంగా హత్య చేసిన దుండగులు… శవాన్ని నదీ తీరంలో పడేసి పారిపోయారు. హత్య కేసు నమోదుచేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరకముందు జేడీఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు రేష్మా. 2013 జేడీఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించిన రేష్మాకు ఆ పార్టీ సీటు ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన రేష్మా… గత అసెంబ్లీ ఎన్నికల ముందు విజయపుర జేడీఎస్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకుని, కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2013లో జేడీఎస్ పార్టీ ఓటమికి రేష్మా ప్రచారం కూడా ఓ కారణం. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఆమె…. ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న సమయంలో ఇలా హత్యకు గురి కావడంతో అనుమానాలు రేగుతున్నాయి.