AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాముడి గుడికి నా విరాళం..

దేశ వ్యాప్తంగ రాముడు ప్రత్యేక పూజలు అందుకున్నాడు. అటు రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు రామనామ జపంలో మునిగి పోయారు. వందల సంవత్సారాల కల నెరవేరడంతో దేశ ప్రజలు ఉప్పొంగిపోయారు. కరోనా కారణంగా ఎవరి ఇంట్లో వారు రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు....

రాముడి గుడికి నా విరాళం..
Sanjay Kasula
|

Updated on: Aug 05, 2020 | 7:27 PM

Share

ఈ రోజు  దేశ వ్యాప్తంగ రాముడు ప్రత్యేక పూజలు అందుకున్నాడు. అటు రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు రామనామ జపంలో మునిగి పోయారు. వందల సంవత్సారాల కల నెరవేరడంతో దేశ ప్రజలు ఉప్పొంగిపోయారు. కరోనా కారణంగా ఎవరి ఇంట్లో వారు రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొవిడ్‌పై పోరాటానికి, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున విరాళం అందించారు. అయోధ్యలో రామమందిరానికి భూమి పూజ సందర్భంగా.. వెంకయ్యనాయుడు ఢిల్లీలోని తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో వెంకయ్య సతీమణితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని ఉప రాష్ట్రపతి టీవీ ద్వారా వీక్షించారు.