AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Promissory Note: ప్రామిసరీ నోట్‌లో ఈ తప్పులు చేస్తే మీ డబ్బులు వదిలేసుకోవడమే..

ప్రామిసరీ నోటు రాసేటప్పుడు అప్పిచ్చే, తీసుకునే వ్యక్తులు, సాక్షులు అప్రమత్తంగా ఉండాలి. రుణం వివరాలు, కాలపరిమితి, కుటుంబ ఖర్చులా, వ్యక్తిగత ఖర్చులా స్పష్టంగా పేర్కొనాలి. బ్యాంకు ద్వారా లావాదేవీలు చేయడం, డిజిటల్ చెల్లింపులు సాక్ష్యంగా ఉంచుకోవడం ముఖ్యం. నోటు వాలిడిటీ మూడు సంవత్సరాలు మాత్రమే. న్యాయపరమైన చిక్కులు నివారించడానికి పూర్తి వివరాలు సక్రమంగా నమోదు చేయాలి.

Promissory Note: ప్రామిసరీ నోట్‌లో ఈ తప్పులు చేస్తే మీ డబ్బులు వదిలేసుకోవడమే..
Promissory Note
Ram Naramaneni
|

Updated on: Apr 10, 2026 | 9:03 AM

Share

ప్రామిసరీ నోటు అనేది వ్యక్తిగత లేదా వ్యాపార రుణ లావాదేవీలలో రుణాన్ని ధృవీకరించే కీలకమైన న్యాయ పత్రం. ఇది రుణదాతకు రక్షణ కల్పిస్తుంది. ఈ నోటు రాసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రామిసరీ నోటులో అప్పిచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్లు, సాక్షులు… నిరక్షరాస్యుల విషయంలో వ్రాసి ఇచ్చువారు అనే నాలుగు ప్రధాన పార్టీలు ఉంటారు. సాధారణంగా, చాలామంది అప్పిచ్చేవాళ్లు అప్పు తీసుకున్న వ్యక్తి నుంచి కేవలం సంతకం మాత్రమే తీసుకుని, రుణం మొత్తం, తేదీ, ఇతర వివరాలను తరువాత నింపుతారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలాంటి సందర్భాలలో, అప్పు తీసుకున్న వ్యక్తి తన సంతకం మాత్రమే చేశానని, పైన రాసిన వివరాలకు తనకు సంబంధం లేదని వాదించవచ్చు. కోర్టులో కేసు దాఖలు చేసినప్పుడు, ప్రామిసరీ నోటులోని సంతకం, రాత ఒకే కాలానికి చెందినవి కాదని ఫోరెన్సిక్ పరీక్షలో తేలితే, కేసు నిలబడదు. ప్రామిసరీ నోటుకు మూడు సంవత్సరాల వాలిడిటీ మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత అది చెల్లదు.

పారదర్శకతను కాపాడటానికి, అప్పు ఇచ్చేవాడు రుణం మొత్తం, తేదీ, కాలపరిమితి, రుణం ఉద్దేశ్యం (కుటుంబ ఖర్చులు లేదా వ్యక్తిగత ఖర్చులు) వంటి అన్ని వివరాలను అప్పు తీసుకున్న వ్యక్తితోనే రాయించాలి. సాక్షుల సంతకాలు కూడా తప్పనిసరి. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి నిరక్షరాస్యుడైతే, అతని వేలిముద్రతో పాటు, అతని తరపున వివరాలు రాసిన వ్యక్తి (వ్రాయించి ఇచ్చువారు) కూడా సంతకం చేయాలి. రుణం ఉద్దేశ్యాన్ని కుటుంబ ఖర్చుల నిమిత్తం అని స్పష్టంగా పేర్కొనడం చాలా ముఖ్యం. అలా చేయడం ద్వారా, అప్పు తీసుకున్న వ్యక్తి మరణించినప్పటికీ, అతని కుటుంబ సభ్యులు ఆ రుణానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒకవేళ వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం అని పేర్కొంటే, అప్పు తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు కుటుంబ సభ్యులపై ఆ రుణ బాధ్యత ఉండదు.

రుణ లావాదేవీలలో బ్యాంకు ద్వారా చెల్లింపులు చేయడం అత్యంత ముఖ్యమైన రక్షణ చర్య. చేతితో నగదు ఇవ్వడం కాకుండా, బ్యాంకు బదిలీ, గూగుల్ పే లేదా ఫోన్‌ పే వంటి డిజిటల్ పద్ధతులు రుజువుగా నిలుస్తాయి. ఈ రికార్డులు తేదీ, సమయం, ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చూపుతాయి. కోర్టులో కేసు దాఖలు చేసినప్పుడు, ఈ బ్యాంక్ లావాదేవీల రికార్డులు బలమైన సాక్ష్యంగా ఉపయోగపడతాయి. ప్రామిసరీ నోటుకు స్టాంప్ అంటించడం, దానిపై సరైన స్థానంలో సంతకం చేయడం కూడా చట్టబద్ధతకు అవశ్యకం. స్టాంప్ కింద లేదా పైన సంతకం చేయడం కాకుండా, స్టాంప్‌పైనే సంతకం చేయాలి. ప్రామిసరీ నోటు కేసులు సివిల్ కేసులుగా పరిగణించబడతాయి. సరైన డాక్యుమెంటేషన్, బ్యాంక్ లావాదేవీల రికార్డులతో పాటు పూర్తి వివరాలతో కూడిన ప్రామిసరీ నోటు మీ కేసును గెలిపించడానికి సహాయపడుతుంది.

Also Read: రోజుకు 12 లీటర్ల పాలిచ్చే ఆవులు.. నిర్వహణ సులభం.. ధర ఎంతంటే.. 

Follow Us