AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కట్నం ఇవ్వలేదని.. నడిరోడ్డుపైనే ట్రిపుల్ తలాక్..!

ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఓ కేసు నమోదయ్యింది. కట్నంగా లక్ష రూపాయలు ఇవ్వలేదని ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోసీకి చెందిన జుమిరాత్‌కు మేవాత్‌ ప్రాంతానికి చెందిన ఇక్రమ్‌తో రెండేళ్ల క్రితం పెళ్లైంది. అయితే, పెళ్లి సమయంలో ఇవ్వాల్సిన కట్నానికి సంబంధించి కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉండగా.. అదే […]

కట్నం ఇవ్వలేదని.. నడిరోడ్డుపైనే ట్రిపుల్ తలాక్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 03, 2019 | 2:11 PM

Share

ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఓ కేసు నమోదయ్యింది. కట్నంగా లక్ష రూపాయలు ఇవ్వలేదని ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోసీకి చెందిన జుమిరాత్‌కు మేవాత్‌ ప్రాంతానికి చెందిన ఇక్రమ్‌తో రెండేళ్ల క్రితం పెళ్లైంది. అయితే, పెళ్లి సమయంలో ఇవ్వాల్సిన కట్నానికి సంబంధించి కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉండగా.. అదే నెపంతో జుమిరాత్‌ను గృహ హింసకు గురిచేస్తున్నాడు. బాధితురాలి తల్లిదండ్రులు కట్నం ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో ఇక్రమ్ నడిరోడ్డుపైనే జుమిరాత్‌కు మూడుసార్లు తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. ఈ విషయమై జుమిరాత్ తల్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం 2019లోని సెక్షన్ 4 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం ప్రకారం మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. నేరం రుజువైతే తలాక్ చెప్పిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.