బిజెపికి కాంగ్రెస్ డైరెక్షన్..హుజూర్ నగర్లో ఏం జరుగుతుందంటే..?

దేశవ్యాప్తంగా అందరి ద‌ృష్టిని ఆకర్షిస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరమైన హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్.. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపింది. మారిన పరిణామాల కారణంగా ఎంపీగా గెలిచిన ఉత్తం కుమార్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నిక రావడానికి కారణమయ్యారు. అయితేనేం.. ఉత్తం కుమార్ తన ప్రాబల్యం చేజారీపోకుండా.. గతంలో కోదాడ నుంచి […]

బిజెపికి కాంగ్రెస్ డైరెక్షన్..హుజూర్ నగర్లో ఏం జరుగుతుందంటే..?
Follow us

| Edited By:

Updated on: Oct 04, 2019 | 8:17 PM

దేశవ్యాప్తంగా అందరి ద‌ృష్టిని ఆకర్షిస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరమైన హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్.. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపింది. మారిన పరిణామాల కారణంగా ఎంపీగా గెలిచిన ఉత్తం కుమార్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నిక రావడానికి కారణమయ్యారు. అయితేనేం.. ఉత్తం కుమార్ తన ప్రాబల్యం చేజారీపోకుండా.. గతంలో కోదాడ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన తన సతీమణి పద్మావతిని ఇపుడు ఉప ఎన్నికల బరిలో నిలిపారు. ఇందుకోసం పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఆయన అమీతుమీకి కూడా సిద్దమయ్యారు. ఈ క్రమంలో హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంటును కాపాడుకోవడం ఉత్తం కుమార్ కు అత్యంత ప్రతిష్టాత్మకం అయ్యింది.

అయితే, ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని సంఖ్యాబలంలో పూర్తిగా పతనం చేసి, శాసనసభలో కనీసం రెండో స్థానానికి కూడా అనర్హతకు గురయ్యేలా చేసిన గులాబీ పార్టీ.. ఇపుడు హుజూర్ నగర్ ను సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి లాక్కుని.. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని చాటేందుకు ప్రయత్నిస్తోంది. కేసీఆర్ ఆదేశాల మేరకు హుజూర్ నగర్ లో మోహరించిన గులాబీ దళం.. విజయం కోసం కావాల్సిన అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అధికార బలం లేని కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ దూకుడును నిలువరించేందుకు ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది. అయితే కథ ఇక్కడితో ముగియలేదు.

తమకు చిరకాల ప్రత్యర్థి అయిన బిజెపిని కూడా కాంగ్రెస్ నేతలు గైడ్ చేస్తుండడం హుజూర్ నగర్లో ఆశ్చర్యకరమైన పరిణామం. ముందుగా ఢిల్లీ వెళ్ళి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు.. తర్వాత బిజెపి నేతలకు కావాల్సిన సరంజామా ఇచ్చి, ఈసీకి నివేదించాల్సిన అంశాలపై క్లియర్ కట్ ట్రైనింగ్ ఇచ్చి మరీ ఢిల్లీకి పంపడం విశేషం వినేందుకు విచిత్రంగా అనిపిస్తున్నా.. ఇది అక్షరాలా నిజం.

గురువారం ఈసీని కలిసేందుకు ఢిల్లీ వెళ్ళిన బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ .. చీఫ్ కమిషనర్ ను కలిసేందకు నిర్వాచన్ సదన్ దగ్గర వెయిట్ చేస్తుండగా.. ఉత్తం కుమార్ రెడ్డి నుంచి కాల్ వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు మీడియా వారితో పిచ్చాపాటి మాట్లాడుతున్న లక్ష్మణ్ ఫోన్ రింగ్ కాగా.. ఆయన మోబైల్లో ఉత్తమ్ కుమార్ పేరు కనిపించిందని అక్కడి ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కాల్ మాట్లాడేందుకు లక్ష్మణ్ మీడియా సిబ్బంది నుంచి దూరంగా వెళ్ళడం ఆశ్చర్యపరిచింది. కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్న సమయంలో ఖచ్చితంగా వివరించాల్సిన అంశాలపై ఉత్తం కుమార్ రెడ్డి.. లక్ష్మణ్ కు బ్రీఫింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

చిరకాల రాజకీయ ప్రత్యర్థి పార్టీలు ఉమ్మడి శత్రువును ఓడించేందుకు రాజకీయ విభేదాలను సైతం పక్కన పెట్టడంతో అక్కడున్న మీడియా వర్గాలు ఆశ్చర్యానికి గురి కాగా.. కొందరు సీనియర్లు మాత్రం.. పొలిటికల్ గేమ్ లో ఇవన్నీ మామూలే అని నవ్వుకోవడం విశేషం.

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు