ఎల్టీటీఈతో ముప్పు, మరో ఐదేళ్లు నిషేధం
ఎల్టీటీఈపై నిషేధం కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రత్యేక తమిళ దేశం కోసం పని చేసిన ఎల్టీటీఈ, భారతదేశ గడ్డపై అనేక దారుణాలకు పాల్పడిందని తన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య తర్వాత తొలిసారి ఎల్టీటీఈపై నిషేధం విధించింది కేంద్రం. ఎల్టీటీఈకి చెందిన కొందరు తమిళనాడులో అడుగుపెట్టారని, వీళ్లు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్టీటీఈపై నిషేధమున్నా దానికి సహకరించే […]
ఎల్టీటీఈపై నిషేధం కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రత్యేక తమిళ దేశం కోసం పని చేసిన ఎల్టీటీఈ, భారతదేశ గడ్డపై అనేక దారుణాలకు పాల్పడిందని తన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య తర్వాత తొలిసారి ఎల్టీటీఈపై నిషేధం విధించింది కేంద్రం. ఎల్టీటీఈకి చెందిన కొందరు తమిళనాడులో అడుగుపెట్టారని, వీళ్లు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్టీటీఈపై నిషేధమున్నా దానికి సహకరించే కొన్ని సంస్థలు, వ్యక్తులు మద్దతుగా ఉన్నారని ప్రస్తావించింది. ఎల్టీటీఈపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆ సంస్థకు చెందిన కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సంగతి తెల్సిందే! భారత్పై వ్యతిరేకత ఎల్టీటీఈలో ఇప్పటికీ బలంగా ఉందన్న హోంశాఖ, దీనివల్ల దేశానికి ప్రమాదం ఉందని భావించి నిషేధాన్ని పొడిగిస్తున్నామని తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.