ములుగు జిల్లాలో ఘోర రోడు ప్రమాదం..బైక్ను ఢీ కొట్టిన కారు.. పరారీలో కారు డ్రైవర్..
ములుగు జిల్లాలో ఘోర రోడు ప్రమాదం చోటు చేసుకుంది. వాజేడు మండలం మండపాక గ్రామ సమీపంలో 163 జాతీయరహదారిపై మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు

ములుగు జిల్లాలో ఘోర రోడు ప్రమాదం చోటు చేసుకుంది. వాజేడు మండలం మండపాక గ్రామ సమీపంలో 163 జాతీయరహదారిపై మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటనాస్థలంలోనే మృతి చెందారు.
ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ఘటనాస్థలంలోనే వాహనాన్ని వదిలి పరిపోయినట్లుగా తెలుస్తోంది. ఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కారులో లభించిన గుర్తింపుకార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల ఏ ప్రాంతానికి చెందిన వారన్నది ఇంకా వివరాలు తెలియరాలేదు. వివరాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయతిస్తున్నారు.