Tirumala Darshan Update: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ టికెట్ల కోటా విడుదల..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ అందిస్తూ వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు రూ. 300 ప్రత్యేక ..
Tirumala Darshan Update: ముక్కోటి ఏకాదశి..! మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పర్వదినం! ఉత్తరద్వార దర్శనం కోసం భక్తకోటి నిరీక్షించే సమయం! ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినాన లక్షలాది భక్తులు తిరుమలకు పోటెత్తుతారు. ఈ నేపధ్యంలో శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ అందిస్తూ వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది.
డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను.. భక్తుల సౌకర్యార్ధం రోజుకు 20 వేల చొప్పున ఆన్లైన్లో విడుదల చేసింది. అలాగే భక్తులకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించింది. తిరుమలలో డిసెంబర్ 25 నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనుంది.
Also Read:
‘జగనన్న అమ్మఒడి’ వివరాలను చెక్ చేసుకోండిలా.. సూచనలు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ..
మరో చోట ప్రత్యక్షమైన వింత స్థంభం.. షాకవుతున్న ప్రజలు.. మిస్టరీని చేధిస్తున్న పరిశోధకులు..