తిరుమలలో ఏసీ గదుల అద్దెలు పెరిగాయ్…

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు షాక్ ఇచ్చింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు వసతి గదులు విషయంలో మరింత భారం కానుంది.

తిరుమలలో ఏసీ గదుల అద్దెలు పెరిగాయ్...
Follow us

|

Updated on: Sep 16, 2020 | 10:43 AM

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు షాక్ ఇచ్చింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు వసతి గదులు విషయంలో మరింత భారం కానుంది. ఏసీ గదుల అద్దెలను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సాధారణ గదుల అద్దెలు పెంచకుండా కేవలం ఏసీ విశ్రాంతి గృహాల అద్దెలను మాత్రమే టీటీడీ పెంచింది. దీంతో గత కొంతకాలంగా తగ్గిన ఆదాయాన్ని పెంచుకునేపనిలో పడింది టీటీడీ. గత ఏడాది నవంబర్ లోనే పెంచిన టీటీడీ మరోసారి ఏసీ గదుల అద్దెలను పెంచింది. ప్రస్తుతం రూ.వెయ్యి గా ఏసీ గదుల ధరలను రూ.1500 కి పెంచింది. అలాగే, భక్తులు సౌకర్యార్థం 120 ఏసీ గదులును అడ్వాన్స్ రిజర్వేషన్ విధానం లో కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ తీసుకున్న నిర్ణయంతో మధ్యతరగతి వారికి మరింత భారం పడుతుంది. అయితే, మిగతా నాన్ ఏసీ గదుల అద్దెల్లో ఏలాంటి మార్పు ఉండబోదని టీటీడీ స్పష్టం చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న అద్దెలు మాత్రమే ఉంటాయని పేర్కొంది. వీటిలో రూ.100, రూ.500, రూ.600 సాధారణ వసతికాగా, రూ.999, రూ.1500 ఏసీ సౌకర్యం ఉంటుంది.

Latest Articles
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు