AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రహ్మోత్సవాలను గుడి ప్రాకారం లోపలే…

దేవదేవుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం తిరుమల గిరులు ముస్తాబవుతున్నాయి. అయితే కలియుగ వైకుంఠంలో శ్రీవారి ఉత్సవాలను కనులారా తిలకించేందుకు వడివడిగా తిరుమల గిరులు చేరుకునేవారికి కరోనా బ్రేకులు వేసింది.

బ్రహ్మోత్సవాలను గుడి ప్రాకారం లోపలే...
Sanjay Kasula
|

Updated on: Sep 18, 2020 | 6:14 PM

Share

దేవదేవుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం తిరుమల గిరులు ముస్తాబవుతున్నాయి. అయితే కలియుగ వైకుంఠంలో శ్రీవారి ఉత్సవాలను కనులారా తిలకించేందుకు వడివడిగా తిరుమల గిరులు చేరుకునేవారికి కరోనా బ్రేకులు వేసింది.

ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జనరద్దీని కట్టడి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది.బ్రహ్మోత్సవాలను గుడి ప్రాకారం లోపలే నిర్వహించాలని తలపెట్టింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఏకాంతంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అన్నీ ఏర్పాట్లు చేశామన్నారు.

శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా వాహనసేవలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలను ఎస్వీబీసీ (SVBC)లో వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తాయనున్నామన్నారు. ఈ నెల 23న గరుడవాహనం రోజు ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. గతంలో గరుడవాహనం రోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించేది.. అయితే భద్రతా కారణాల దృష్ట్యా 13ఏళ్లుగా ధ్వజారోహణం రోజు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్న కారణంగా సీఎం జగన్ గరుడసేవరోజు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు.

ఈనెల 24 కర్నాటక సత్రం నూతన భవన నిర్మాణానికి భూమిపూజ జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప భూమిపూజలో పాల్గొంటారని తెలిపారు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి

ఇదిలావుంటే… టీటీడీ ప్రతి ఏటా ప్రచూరించే డైరీల సంఖ్యను తగ్గించామని సోషియల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్. కరోనా కారణంగానే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 25శాతంకు కుదించామని అన్నారు. పారదర్శకత కోసమే టీటీడీని కాగ్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని గుర్తు చేశారు. లాక్‌డౌన్ గైడ్ లైన్స్ దృష్టిలో పెట్టుకుని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కళ్యాణోత్సవ మండపం వద్ద క్యూలైన్లలో వాహనసేవలు వీక్షించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ అన్నారు.

Follow Us
భారత్ సరిహద్దు వెంబడి నిరసనలకు జమాత్ పిలుపు..!
భారత్ సరిహద్దు వెంబడి నిరసనలకు జమాత్ పిలుపు..!
ఎయిరిండియా ఘోర ప్రమాదానికి ఏడాది.. ఇంకా తేలని మిస్టరీ..
ఎయిరిండియా ఘోర ప్రమాదానికి ఏడాది.. ఇంకా తేలని మిస్టరీ..
మన పూర్వీకులు దీన్ని తినడం వల్లే నడుపు నొప్పి లేకుండా ఉన్నారు..
మన పూర్వీకులు దీన్ని తినడం వల్లే నడుపు నొప్పి లేకుండా ఉన్నారు..
పేదోళ్ళ టిఫిన్.. కప్పు అన్నం కొద్దిగా కారంతో .. పుల్ల పుల్లగా..
పేదోళ్ళ టిఫిన్.. కప్పు అన్నం కొద్దిగా కారంతో .. పుల్ల పుల్లగా..
బావ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. బాబాయ్‌ సర్‌ప్రైజ్‌..
బావ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. బాబాయ్‌ సర్‌ప్రైజ్‌..
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో హిట్ మాన్
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో హిట్ మాన్
ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ పెనాల్టీపై ఇంత రహస్యం ఉంటుందా?
ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ పెనాల్టీపై ఇంత రహస్యం ఉంటుందా?
ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి..చివరికి ఇలా
ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి..చివరికి ఇలా
మీ వంటింట్లోనే మీ ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువులు..
మీ వంటింట్లోనే మీ ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువులు..
ఫిఫా వరల్డ్ కప్ 2026 ద్వారా రూ.86 వేల కోట్ల సంపాదన ఎలాగో తెలుసా?
ఫిఫా వరల్డ్ కప్ 2026 ద్వారా రూ.86 వేల కోట్ల సంపాదన ఎలాగో తెలుసా?