AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై ఆర్టీసీ ప్రయాణికులపై ఛార్జీల బాదుడు.. ఎంతంటే.?

టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా చార్జీలను పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి విదితమే. ఇక ఈ చార్జీల పెంపు.. సోమవారం అర్ధరాత్రి అనగా డిసెంబర్ 3వ తేదీ నుంచి అమలు కానుంది. కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీలు పెంచుతూ ఆర్టీసీ అధికారులు పూర్తి నివేదికను కేసీఆర్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. అంతేకాక కనీస చార్జీల విషయంలో కూడా కసరత్తులు చేశారని.. ఆర్డినరీ బస్సుల్లో కూడా సాధారణ చార్జీ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. […]

ఇకపై ఆర్టీసీ ప్రయాణికులపై ఛార్జీల బాదుడు.. ఎంతంటే.?
Ravi Kiran
| Edited By: |

Updated on: Dec 02, 2019 | 5:25 PM

Share
టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా చార్జీలను పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి విదితమే. ఇక ఈ చార్జీల పెంపు.. సోమవారం అర్ధరాత్రి అనగా డిసెంబర్ 3వ తేదీ నుంచి అమలు కానుంది. కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీలు పెంచుతూ ఆర్టీసీ అధికారులు పూర్తి నివేదికను కేసీఆర్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. అంతేకాక కనీస చార్జీల విషయంలో కూడా కసరత్తులు చేశారని.. ఆర్డినరీ బస్సుల్లో కూడా సాధారణ చార్జీ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రం కిలోమీటర్‌ ఆధారంగా వసూలు చేయనున్నట్లు సమాచారం.
బస్సులు వారీగా ప్రస్తుత చార్జీలు ఇలా ఉన్నాయి…
ఎక్స్‌ప్రెస్ – 87 పైసలు
డీలక్స్ – 98 పైసలు
సూపర్ లగ్జరీ – 1.16 పైసలు
రాజధానికి – 1.46 పైసలు
గరుడకు – 1.71 పైసలు
గరుడ ప్లస్ – 1.82 పైసలు
వెన్నెల సర్వీసు – 2.53 పైసలు చొప్పున ప్రస్తుతం చార్జీలు ఉండగా.. ఇప్పుడు వీటికి కిలోమీటర్ చొప్పున 20 పైసలు కలుపుతారు. ఉదాహరణకు హైదరాబాద్- కరీంనగర్ మధ్య 160 కిలోమీటర్లు దూరం కాగా.. దీని బట్టి కొత్త చార్జీ రూ.172 వరకు పెరుగుతుంది. ఇలా పెరిగిన చార్జీలన్నింటిని అధికారులు టికెట్ మిషన్స్‌లో ఫిక్స్ చేస్తున్నారు. అటు సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఇకపై కనీస టికెట్ ధర రూ.10గా చేయాలని నిర్ణయించగా.. పల్లెవెలుగు బస్సుల్లో ఆ రేట్.. రూ.8గా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ కొత్త రేట్ల వివరాన్నింటిని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. కాగా, కొత్తగా పెరగనున్న చార్జీలు ద్వారా ఆర్టీసీకి అదనంగా రూ. 752 కోట్లు రాబడి రానున్నట్లు తెలుస్తోంది.