Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దూకుడు.. మరో 20 మందితో రెండో జాబితా విడుదల

బల్దియా ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు కదనరంగంలో దూకుడు పెంచాయి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దూకుడు..  మరో 20 మందితో రెండో జాబితా విడుదల
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 19, 2020 | 3:12 PM

బల్దియా ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు కదనరంగంలో దూకుడు పెంచాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ముందు వరుసలో నిలిచింది. నిన్న 105 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించిన టీఆర్ఎస్.. ఇవాళ మరో 20 మందితో రెండో జాబితాను విడుదలచేసింది. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో జోరు పెంచారు. ఇంటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అటు, ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీకి ధీటైన అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలుపుడుతున్నాయి.

రెండో జాబితా డివిజన్లవారీగా అభ్యర్థుల వివరాలు ఇలాః

1. మల్లాపూర్‌ దేవేందర్‌రెడ్డి

2. రామాంతపూర్‌   జోత్స్న

3. బేగంబజార్‌ పూజా వ్యాస్‌ బిలాల్‌

4. సులేమాన్‌ నగర్‌ సరితా మహేష్‌

5. శాస్త్రిపురం   రాజేష్‌యాదవ్‌

6. రాజేంద్రనగర్ శ్రీలత

7. హిమాయత్‌నగర్‌ హేమలత యాదవ్‌

8. బాగ్‌అంబర్‌పేట   పద్మావతి రెడ్డి

9. భోలక్‌పూర్‌ నవీన్‌కుమార్‌

10. షేక్‌పేట్‌ సత్యనారాయణ యాదవ్‌

11. శేరిలింగంపల్లి రాగం నాగేందర్‌

12. అడ్డగుట్ట ప్రసన్న లక్ష్మి

13. మెట్టుగూడ రాసూరి సునీత

14. బౌద్ధనగర్ ‌ కంది శైలజ

15. బేగంపేట్‌ మహేశ్వరి శ్రీహరి

16. వివేకానందనగర్‌ కాలనీ రోజా రంగారావు

17. వినాయక్‌నగర్‌ బద్ధం పుష్పలతరెడ్డి

18. బాలానగర్‌ రవీందర్‌రెడ్డి

19. కూకట్‌పల్లి సత్యనారాయణ జూపల్లి

20. మైలార్‌దేవ్‌పల్లి ప్రేమ్‌దాస్‌ గౌడ్‌