AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ క్రెడిట్ అంతా.. కేసీఆర్‌కే : టీఆర్ఎస్ ఎంపీలు

దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పూజలు చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాయన్నారు రాజ్యసభ సభ్యుడు కేశవరావు. సీఎం కేసీఆర్ లేకపోతే ప్రాజెక్టు పూర్తికాకపోయేదని.. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్‌కే దక్కుతుందన్నారు కేకే. కాగా.. నాలుగు దశాబ్దాల నుంచి ప్రాజెక్టుపై గత పాలకులు మాట్లాడారే తప్పా.. ఎక్కడా వాటిని పూర్తిచేయలేదని ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు ఆరోపించారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో […]

ఆ క్రెడిట్ అంతా.. కేసీఆర్‌కే : టీఆర్ఎస్ ఎంపీలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2019 | 6:38 PM

Share

దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పూజలు చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాయన్నారు రాజ్యసభ సభ్యుడు కేశవరావు. సీఎం కేసీఆర్ లేకపోతే ప్రాజెక్టు పూర్తికాకపోయేదని.. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్‌కే దక్కుతుందన్నారు కేకే.

కాగా.. నాలుగు దశాబ్దాల నుంచి ప్రాజెక్టుపై గత పాలకులు మాట్లాడారే తప్పా.. ఎక్కడా వాటిని పూర్తిచేయలేదని ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు ఆరోపించారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సఖ్యతగా ఉంటూ.. వడివడిగా ప్రాజెక్టు పూర్తి చేశారన్నారు. లక్షలాది ఎకరాలకు సాగు.. 80 శాతం ప్రజలకు తాగునీరు.. దాంతో పాటు.. పరిశ్రమలకు కావాల్సిన నీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందుతాయన్నారు నామా.