టాప్ 10 న్యూస్@9AM
1. కొనసాగుతున్న తెలంగాణ బంద్.. నిలిచిపోయిన క్యాబ్ సర్వీసులు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకి చేరుకుంది. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ..Read more 2. హుజూర్నగర్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. నేటి సాయంత్రం 5.00 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో.. […]
1. కొనసాగుతున్న తెలంగాణ బంద్.. నిలిచిపోయిన క్యాబ్ సర్వీసులు
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకి చేరుకుంది. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ..Read more
2. హుజూర్నగర్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. నేటి సాయంత్రం 5.00 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో.. అగ్రనేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ రామారావు తరఫున ప్రచారం చేసేందుకు.. Read more
3. సేనానికి షాక్.. సీఎం జగన్కు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం..!
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ప్రవేశ పెట్టిన వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసించారు. ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆయన.. Read more
4. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు జగన్ మరో గుడ్ న్యూస్..!
లక్షల మంది ప్రయాణికులను నిత్యం గమ్యస్థానానికి చేరుస్తున్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో మార్గదర్శకాలను సవరించింది. గతంలో ఆటో నడుపుతున్న వ్యక్తి పేరు.. Read more
5. అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. రూ. 264.99 కోట్లు విడుదల
అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు.. Read more
6. సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురి గల్లంతు
సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నడిగూడెం మండలం చాకిరాల వద్ద సాగర్ ఎడమ కాల్వలో స్కార్పియో వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ అంకుర్ ఆస్పత్రికి చెందిన ఆరుగురు సిబ్బంది.. Read more
7. అసద్ జీ.. డ్యాన్స్ అదుర్స్..! మీరు చూశారా?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డ్యాన్స్లతో దుమ్ములేపారు. ఔరంగాబాద్లోని పైథాన్ గేట్ వద్ద ర్యాలీ ముగియగానే వేదిక దిగి వెళ్తూ డ్యాన్స్ చేశారు. ‘మియా భాయ్’ పాటకు డ్యాన్స్ చేయడంతో.. Read more
8. చరిత్రపై చిచ్చు.. చెరిపేస్తారా ? తిరగరాస్తారా ?
మనం చదువుకున్నది.. మన చరిత్ర కాదా..? బ్రిటిషర్ల దృష్టితో రాసిన చరిత్రేనా ఇది? ఇతిహాసాన్ని పరిహాసంగా మార్చారా..? అసలు మన చరిత్ర ఏంటి..? ఎక్కడ మొదలైంది..? ఎవరితో ముగిసింది..? దేశం కోసం పోరాడిన వీరుల్లో కొందరిని మరిచామా..? మొఘలులు.. Read more
9. వీడో మంచి దొంగ.. ‘బామ్మకు ముద్దు-డబ్బులు వద్దు’
బ్రెజిల్లో జరిగిన ఓ దొంగతనం వైరల్గా మారింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఓ ఫార్మసీలోకి చొరబడిన ఇద్దరు దొంగలు.. వ్యాపారిని గన్తో బెదిరిస్తూ డబ్బులు, వస్తువులు దోచుకున్నారు. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వృద్ధ.. Read more
10. ఆస్పత్రి నుంచి బిగ్ బీ డిశ్చార్జ్
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం కుదుటపడింది. దీంతో ఆయన్ను శుక్రవారం రాత్రి ముంబైలోని నానావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అమితాబ్ను అయన కుమారుడు అభిషేక్ బచ్చన్, భార్య జయాబచ్చన్లు కారులో వచ్చి ఆసుపత్రి నుంచి ఇంటికి.. Read more