AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కౌంటింగ్‌కు రెడీ..!

తెలంగాణ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. 31 జిల్లాల్లోని 17 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్లు 37 ప్రాంతాల్లో 123 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. రేపు జరగబోయే ఓట్ల లెక్కింపునకు సంబంధించి 13 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలతో పాటు 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈటీపీబీఎస్‌, పోస్టల్‌ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుందని వివరించారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు […]

తెలంగాణలో కౌంటింగ్‌కు రెడీ..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 22, 2019 | 3:14 PM

Share

తెలంగాణ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. 31 జిల్లాల్లోని 17 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్లు 37 ప్రాంతాల్లో 123 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. రేపు జరగబోయే ఓట్ల లెక్కింపునకు సంబంధించి 13 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలతో పాటు 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఈటీపీబీఎస్‌, పోస్టల్‌ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుందని వివరించారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్‌ పరిధిలోని ప్రతి అసెంబ్లీ స్థానంలో 2 హాళ్లు, 36 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపులో జాగ్రత్తగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు.

వీవీ ప్యాట్‌ స్లిప్పుల రీకౌంటింగ్‌ కోసం అభ్యర్థి ఆర్వోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫలితాల వెల్లడిలో ఆర్వోదే తుదినిర్ణయమని, ఈసీ జోక్యం చేసుకోదని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈవీఎం, వీవీప్యాట్‌ ఓట్లలో తేడా రాలేదని, వీవీ ప్యాట్‌లో మాక్‌ పోలింగ్ స్లిప్పులు క్లియర్‌ చేయకపోతేనే తేడా వస్తుందన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపులో మానవతప్పిదం జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో మీడియా సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు రజత్‌కుమార్‌ తెలిపారు.

ఇక ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సెంటర్లకు 100 మీటర్ల దూరంలో జన సంచారం, వాహనాల అనుమతిపై నిషేదాజ్ఞలు విధించారు. ఫలితాల వెల్లడి తర్వాత కూడా విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి తప్పనిసరి అని చెప్పారు. అనుమతి తీసుకుంటేనే భద్రత కల్పిస్తామని లా అండ్ ఆర్డర్ అడిషనల్ జితేందర్ రెడ్డి వెల్లడించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రత వ్యవహారాల్ని పర్యవేక్షించేందుకు ఇన్‌ఛార్జ్‌గా డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు.

Follow Us
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..