AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్పొరేటర్ ని కబళించిన కరోనా !

మహరాష్ట్రలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు దాదాపు లక్షకు చేరువలో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్న ప్రజా ప్రతినిధులు కరోనాబారినపడుతున్నారు.

కార్పొరేటర్ ని కబళించిన కరోనా !
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 10, 2020 | 1:59 PM

Share

మహరాష్ట్రలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు దాదాపు లక్షకు చేరువలో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్న ప్రజా ప్రతినిధులు కరోనాబారినపడుతున్నారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ ముకుంద్ కేని కరోనా వైరస్ తో మరణించారు. కరోనాబారినపడి చనిపోయిన కార్పొరేటర్లలో రెండో వ్యక్తి ముకుంద్. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ ముకుంద్ కేనీకి 14 రోజుల క్రితం కొవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. కరోనా రోగులకు సహకరించేందుకు ముకుంద్ కేని ఆసుపత్రిని సందర్శించడం వల్ల ఆయన కరోనా వైరస్ బారినపడ్డారు. ముకుంద్ కేనీకి థానేలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నిర్వహించిన పరీల్లో కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని థానే నుంచి వెంటనే ముంబైలోని ఆసుపత్రికి మార్చారు. డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న ముకుంద్ కు వెంటిలేటర్ ఏర్పాటు చేశారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ముకుంద్ చికిత్స పొందుతూ మరణించారు. ముకుంద్ కేనీ భార్య ప్రమీలా కేని థానే మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతిపక్ష నాయకురాలు. గతంలో మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ లో శివసేన కార్పొరేటర్ కరోనాతో మరణించారు.