AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నుల పండువగా సాగిన తెప్పోత్సవం

కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరాస్వామి వార్లు విహరించారు. విజయదశమి సందర్భంగా కృష్ణా నదిలో నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు విహరించారు. తెప్పోత్సవాన్ని కన్నులారా తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు కృష్ణానది ఒడ్డకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దంపతులు, దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దంపతులు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ దంపతులు, కృష్ణా జిల్లా కలెక్టర్ మధవీలత, దుర్గ గుడి ఈవో […]

కన్నుల పండువగా సాగిన తెప్పోత్సవం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 08, 2019 | 9:10 PM

Share

కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరాస్వామి వార్లు విహరించారు. విజయదశమి సందర్భంగా కృష్ణా నదిలో నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు విహరించారు. తెప్పోత్సవాన్ని కన్నులారా తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు కృష్ణానది ఒడ్డకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దంపతులు, దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దంపతులు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ దంపతులు, కృష్ణా జిల్లా కలెక్టర్ మధవీలత, దుర్గ గుడి ఈవో సురేశ్‌బాబు పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం సుమారు గంటన్నరపాటు ఈ కార్యక్రమం ఆహ్లాదంగా సాగింది.   మరోవైపు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. మధ్యాహ్నం ఆలయ అర్చకులు పూర్ణాహుతిని నిర్వహించి ఉత్సవాలను సాంప్రదాయబద్దంగా ముగించారు.