టెక్సాస్లో దారుణం.. భార్యను కాల్చి, ఆత్మహత్య చేసుకున్న తెలుగు వ్యక్తి
టెక్సాస్: అమెరికాలో దారుణం జరిగింది. తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాల కారణంతో తన భార్యను కాల్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడి తెలుగు సంఘాల నాయకులు వెల్లడించిన వివరాల ప్రకారం నెకరకంటి శ్రీనివాస్ అనే వ్యక్తి, టెక్సాస్లో ఇంధన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం ఆ ఇంటి నుంచి తుపాకీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చే సమయానికి […]
టెక్సాస్: అమెరికాలో దారుణం జరిగింది. తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాల కారణంతో తన భార్యను కాల్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడి తెలుగు సంఘాల నాయకులు వెల్లడించిన వివరాల ప్రకారం నెకరకంటి శ్రీనివాస్ అనే వ్యక్తి, టెక్సాస్లో ఇంధన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
సోమవారం ఆ ఇంటి నుంచి తుపాకీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చే సమయానికి శాంతి, శ్రీనివాస్లు విగత జీవులుగా కనిపించారు. ఆ సమయంలో వీరి కుమార్తె ఇంట్లోనే తన గదిలో ఉండగా.. చదువు నిమిత్తం కుమారుడు కాలేజీకి వెళ్లాడు. శ్రీనివాస్, శాంతి మధ్య గొడవ ఎందుకు జరిగిందన్న విషయమై కుమార్తె వద్ద సమాచారం లేదని, కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.