AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ప్రతీ ఆదివారం 10 గంటలకు.. 10 నిమిషాలు’ ఇంట్లో క్లీనింగ్‌ చేసిన కేటీఆర్

దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే 10 వారాల పాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ నిర్ణయిచింది. పౌరులు తమ ఇళ్ల ప్రాంగణంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని..

'ప్రతీ ఆదివారం 10 గంటలకు.. 10 నిమిషాలు' ఇంట్లో క్లీనింగ్‌ చేసిన కేటీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 10, 2020 | 5:52 PM

Share

ఇప్పటికే కరోనా వైరస్‌తో దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా అందరూ భయబ్రాంతులకు గురి అవుతున్నారు. అందులోనూ ఇక ఇప్పుడొచ్చేది రెయిన్ సీజన్. దీంతో సీజనల్ వ్యాధుల నివారణ కోసం తెలంగాణ పురపాలక శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ‘ప్రతీ ఆదివారం.. పది గంటలకు.. పది నిమిషాలు’ కార్యక్రమంలో ఈ రోజు మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే 10 వారాల పాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ నిర్ణయిచింది. పౌరులు తమ ఇళ్ల ప్రాంగణంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు. ఈ క్రమంలో భాగంగా మంత్రి నేడు 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రగతి భవన్‌ ప్రాంగణంలోని పూలకుండీలు, ఇతర చోట్ల నీటి నిల్వను పరిశీలించారు.

వర్షాకాలం నాటికి దోమల వలన కలిగే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రజలు ఇప్పటి నుంచే కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పూలకుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. అలాగే ఇంటి పరిసరాలను శుభ్రపరిచారు. అదే విధంగా యాంటీ లార్వా మందులు చల్లారు కేటీఆర్.

Read More:

ఈ రోజు రాత్రికే గుడిలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి..

గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ మృతి.. షాక్‌లో సినీ ప్రముఖులు

బ్రేకింగ్: భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు