లాక్ డౌన్ సమయంలో అధిక రేట్లు వసూలు చేస్తున్నారని లక్ష ఫిర్యాదులు…
లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ కన్జ్యూమర్ ఫోరమ్కు కంప్లైంట్స్ ఓరేంజ్ లో వచ్చాయి. ఫోరం ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్1967, ప్రత్యేక వాట్సప్ నంబర్ 7330774444కు లక్షకు పైగా కంప్లయింట్స్ అందాయి. లాక్ డౌన్ ఆసరాగా చేసుకుని అధిక రేట్లు వసూలు చేస్తున్నారని, తూకం తక్కువగా ఇస్తున్నారని, సరుకులలో నాణ్యత ఉండటం లేదంటూ ఫిర్యాదులు వచ్చాయి. మార్చి 22 నుంచి మే 9వరకు… 47 రోజుల్లో కన్జ్యూమర్ ఫోరానికి వచ్చిన కంప్లైంట్స్ […]
లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ కన్జ్యూమర్ ఫోరమ్కు కంప్లైంట్స్ ఓరేంజ్ లో వచ్చాయి. ఫోరం ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్1967, ప్రత్యేక వాట్సప్ నంబర్ 7330774444కు లక్షకు పైగా కంప్లయింట్స్ అందాయి. లాక్ డౌన్ ఆసరాగా చేసుకుని అధిక రేట్లు వసూలు చేస్తున్నారని, తూకం తక్కువగా ఇస్తున్నారని, సరుకులలో నాణ్యత ఉండటం లేదంటూ ఫిర్యాదులు వచ్చాయి. మార్చి 22 నుంచి మే 9వరకు… 47 రోజుల్లో కన్జ్యూమర్ ఫోరానికి వచ్చిన కంప్లైంట్స్ సంఖ్య దాదాపు లక్ష ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లోని సూపర్ మార్కెట్లపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. మాములు రోజుల్లో సగటున 300 ఫిర్యాదులు ఉంటే.. లాక్డౌన్ టైంలో 2 వేల ఫిర్యాదులు వస్తున్నాయని ఓ అధికారి పేర్కొన్నారు. లాక్ డౌన్ ను దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదులు తీసుకునేందుకు ఫోరమ్ స్పెషల్ ఏర్పాట్లు చేసింది. ఫోన్, వాట్సప్ నెంబర్ కు వచ్చిన కంప్లైంట్స్ వెంటనే ఎన్ ఫోర్స్ మెంట్, తూనికలు కొలతల శాఖ అధికారులకు పంపుతున్నారు.
ఇక కరోనా సంక్షోభ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు నెలకు రూ.1,500 బ్యాంకుల్లో వేసింది. తమకు డబ్బులు రాలేదని టోల్ ఫ్రీ నంబర్ 180042500333కు వేల సంఖ్యల్లో కంప్లైంట్స్ అందాయి.