AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్‌‌లో 30 శాతం సిలబస్ తగ్గించారు…

తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌ను తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది...

ఇంటర్‌‌లో 30 శాతం సిలబస్ తగ్గించారు...
Sanjay Kasula
|

Updated on: Sep 22, 2020 | 10:13 PM

Share

తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌ను తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఈయర్‌లో 30 శాతం సిలబస్ తగ్గించింది.

సీబీఎస్‌ఈ (CBSE)సూచనల ప్రకారం ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు సబ్జెక్ట్‌లో 30 శాతం సెలబస్‌ను ఇంటర్ బోర్డు తగ్గించింది. మరోవైపు ఇంటర్ సెకండ్ ఈయర్‌లో హిస్టరీ, ఏకనామిక్స్, పొలిటికల్ సైన్స్ (సివిక్స్), జియోగ్రఫ్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అకౌంటెన్సీలో  సిలబస్‌ను ఇంటర్ బోర్డు తగ్గించింది. అయితే తగ్గించిన సిలబస్ 2020-21 సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని, తగ్గించిన సెలబస్‌ను ఇంటర్ వెబ్ సైట్‌లో చూడవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు  వెల్లడించారు.

కాగా కరోనాను నివారించేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా, దేశ వ్యాప్తంగా నాలుగు నెలల తరగతులు నిర్వహించలేకపోయారు. అయితే ఆలస్యం కావడం వల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం (CBSE) ఈ విద్యా సంవత్సరాన్ని జీరో ఇయర్ ‌(సంవత్సరం పాటు క్లాసులు నిర్వహించకపోవడం) నుంచి కాపాడటానికి కొన్ని సూచనలు చేసింది. తగ్గించిన సిలబస్ వివరాలను టీఎస్‌బీఐఈ (TSBIE) అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in లో సందర్శించవచ్చని ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు.