AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేబినెట్‌ స్పెల్లింగే రాదు కానీ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ను విమర్శిస్తున్నారు

విమర్శలు, ప్రతి విమర్శలతో బీహార్‌ ఎన్నికల సభలు హోరెత్తుతున్నాయి.. సభలు సమావేశాలకు కోవిడ్‌-19 నిబంధనలు ఉన్నా.. నేతల మాటలకు లేవు కాబట్టే ధ్వని కాలుష్యం పెరుగుతోంది.. ఆర్‌జేడీ నేత, మహాగడ్బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌పై కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే సెటైర్లు వేశారు. కేబినెట్ అన్న పదానికి స్పెల్లింగ్‌ కూడా రాని తేజస్వీ యాదవ్‌ ఇంజనీరింగ్ చదివిన ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను విమర్శించేటంతవాడయ్యాడా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలపై అవగాహన లేని వ్యక్తి, కనీసం టెంత్‌ […]

కేబినెట్‌ స్పెల్లింగే రాదు కానీ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ను విమర్శిస్తున్నారు
Balu
|

Updated on: Oct 31, 2020 | 5:34 PM

Share

విమర్శలు, ప్రతి విమర్శలతో బీహార్‌ ఎన్నికల సభలు హోరెత్తుతున్నాయి.. సభలు సమావేశాలకు కోవిడ్‌-19 నిబంధనలు ఉన్నా.. నేతల మాటలకు లేవు కాబట్టే ధ్వని కాలుష్యం పెరుగుతోంది.. ఆర్‌జేడీ నేత, మహాగడ్బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌పై కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే సెటైర్లు వేశారు. కేబినెట్ అన్న పదానికి స్పెల్లింగ్‌ కూడా రాని తేజస్వీ యాదవ్‌ ఇంజనీరింగ్ చదివిన ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను విమర్శించేటంతవాడయ్యాడా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలపై అవగాహన లేని వ్యక్తి, కనీసం టెంత్‌ కూడా పాసవ్వని ఓ వ్యక్తి ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ అయిన నితీశ్‌కుమార్‌ను విమర్శిస్తున్నారని దెప్పిపొడిచారు. ఆయన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా ఇంతకు ముందు ఉద్యోగాల హామీ ఇచ్చినవారేనని అశ్వినీ చౌబే అన్నారు.. లాలూ తన మొదటి కేబినెట్‌లో లక్ష ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని, ఇప్పుడు తేజస్వీ యాదవ్‌ కూడా అదే పని చేస్తారని అన్నారు. ఇప్పటికీ ఆ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చేసుకున్న అప్లికేషన్లు చెత్తబుట్టలో పడి ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాల పేరు చెప్పి అప్పుడు ఆర్‌జేడీ నేతలు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఆర్‌జేడీ-కాంగ్రెస్‌ కూటమి సాధ్యంకాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.