AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Australia: టెస్టు ఛాంపియన్​షిప్​లో ఫస్ట్ ప్లేసుకు దూసుకెళ్లిన భారత్.. మూడో స్థానానికి పడిపోయిన ఆసిస్

అట్టాంటి.. ఇట్టాంటి విజయం కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తం దిమ్మతిరిగే విజయం. డ్రాగా ముగిస్తే చాలు అనుకుంటున్న మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు రెచ్చిపోయారు.

India vs Australia: టెస్టు ఛాంపియన్​షిప్​లో ఫస్ట్ ప్లేసుకు దూసుకెళ్లిన భారత్.. మూడో స్థానానికి పడిపోయిన ఆసిస్
Ram Naramaneni
|

Updated on: Jan 19, 2021 | 2:21 PM

Share

అట్టాంటి.. ఇట్టాంటి విజయం కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తం దిమ్మతిరిగే విజయం. డ్రాగా ముగిస్తే చాలు అనుకుంటున్న మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు రెచ్చిపోయారు. ఆసిస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించి.. 2-1తో నాలుగు టెస్టుల సిరీస్‌ను, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. చరిత్ర లిఖించిన ఈ విజయంతో భారత జట్టు మరోసారి టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టాప్ ప్లేసులో నిలిచింది. ఇప్పటివరకు ఫస్ట్ ప్లేసులో ఉన్న ఆస్ట్రేలియా మూడోస్థానానికి పడిపోయింది.  ప్రస్తుతం 5 సిరీస్‍ల్లో 13 టెస్టులాడి 9 విజయాలు సాధించిన భారత జట్టు ఖాతాలో 430 పాయింట్లు ఉన్నాయి. 71.7 శాతం విజయాలతో నంబర్ ప్లేసులోకి వెళ్లింది దూసుకెళ్లింది. ఆసీస్ ఖాతాలో 332 పాయింట్ల ఉండగా.. 69.2 శాతం విజయాలతో మూడో స్థానంలో ఉంది. 70.0 శాతం విజయాలతో న్యూజిలాండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది.

చారిత్రక సిరీస్​ విజయంతో టీమ్​ఇండియాకు భారత క్రికెట్​ బోర్డు నజరానా ప్రకటించింది. రూ. 5 కోట్లను టీం బోనస్​గా ప్రకటించింది బీసీసీఐ.  ఇదే విషయాన్ని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా.