AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS SA: మొదటి టెస్ట్‌ విజయానందంలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్‌.. జరిమానాతో పాటు..

సెంచూరియన్‌ వేదికగా దక్షిణఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా కఠినమైన సఫారీ పర్యటనలో శుభారంభం

IND VS SA: మొదటి టెస్ట్‌ విజయానందంలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్‌.. జరిమానాతో పాటు..
Basha Shek
|

Updated on: Jan 01, 2022 | 9:13 AM

Share

సెంచూరియన్‌ వేదికగా దక్షిణఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా కఠినమైన సఫారీ పర్యటనలో శుభారంభం అందుకుంది. మూడు టెస్ట్‌ల మ్యాచ్‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. అదేవిధంగా సెంచూరియన్‌ మైదానంలో టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఈ విజయానందంలో ఉన్న టీమిండియాకు ఐసీసీ గట్టి షాక్‌ ఇచ్చింది. మొదటి టెస్టులో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసిందన్న కారణంతో టీమిండియా మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధించింది. ఈ జరిమానాతో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2022-23 పాయింట్ల పట్టికలో టీమిండియాకు ఒక పాయింట్‌ కోత పడనుంది.

డబ్ల్యూటీసీ పాయిం ట్ల పట్టికలోనూ.. ఐసీసీ ప్రవర్తనా నియమావళి 2.22 ప్రకారం సెంచూరియన్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయలేకపోయింది. దీని కారణంగా టీమిండియాతో పాటు సహాయక సిబ్బందికి మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. దీంతోపాటు ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం 16.11 ప్రకారం.. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా టీమిండియాకు ఐసీసీ వరల్డ్‌టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2022-23లో ఒక పాయింట్‌ కోత పడింది. కాగా ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. ఇక సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా.. జనవరి 3 నుంచి జోహెన్నెస్‌బర్గ్‌ వేదికగా రెండో టెస్టు ఆడనుంది.