అక్కడి టీచర్లకు పీపీఈ కిట్లు…ప్రభుత్వం కీలక నిర్ణయం..
కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్లలోని కేంద్రాలలో జరిగే పదవ తరగతి బోర్డు పరీక్షలకు విధి నిర్వహణకు హాజరయ్యే టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈ కిట్లు) అందిస్తుందని తమిళనాడు పాఠశాల విద్యా మంత్రి కె.ఎ. సెంగోట్టయ్యన్ చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కంటైన్మెంట్ జోన్లలోని విద్యార్థుల కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పాఠశాల విద్యా విభాగం, చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల ద్వారా, పరీక్షలకు హాజరయ్యే ఏ విద్యార్థికి కోవిడ్-19 సోకలేదని […]
కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్లలోని కేంద్రాలలో జరిగే పదవ తరగతి బోర్డు పరీక్షలకు విధి నిర్వహణకు హాజరయ్యే టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈ కిట్లు) అందిస్తుందని తమిళనాడు పాఠశాల విద్యా మంత్రి కె.ఎ. సెంగోట్టయ్యన్ చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కంటైన్మెంట్ జోన్లలోని విద్యార్థుల కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
పాఠశాల విద్యా విభాగం, చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల ద్వారా, పరీక్షలకు హాజరయ్యే ఏ విద్యార్థికి కోవిడ్-19 సోకలేదని నిర్ధారిస్తున్నామని, పరీక్షా కేంద్రాల్లో కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రస్తుతం ఇతర జిల్లాల్లో లేదా రాష్ట్రాల్లో ఉంటున్నట్లయితే వారికి ఇ-పాస్లు అందిస్తామని చెప్పారు. హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులు పరీక్షా తేదీకి మూడు రోజుల ముందు ఆయా పాఠశాలలకు చేరుకోవాలని, వారిని అక్కడికి తీసుకురావడానికి సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సెంగోట్టయ్యన్ అన్నారు. పరీక్షల షెడ్యూల్, ఇతర వివరాలు కొండ ప్రాంతాలలోని విద్యార్థులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు మిస్టర్ మంత్రి వెల్లడించారు.