AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తబ్లీగీల ఓవ‌రాక్ష‌న్… మాంసాహారం కావాలంటూ..ప్లేట్లు విసిరికొట్టి

తబ్లీగీ జమాత్​ సభ్యులు..ఓవ‌రాక్ష‌న్ తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇంత విపత్క‌ర ప‌రిస్థితుల్లో కూడా వారు దురుసు ప్రవర్తనను మార్చుకోవ‌డం లేదు. యూపీ​ కాన్పుర్​లోని రెండు హాస్పిట‌ల్స్ లో మెడిక‌ల్ స్టాఫ్ తో అసభ్యంగా ప్రవర్తించారు. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన‌ సుమారు 60 మంది తబ్లీగీలు.. స్థానిక హల్లెట్​ ఆసుపత్రి ఐసోలేషన్​ వార్డులో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మాంసాహారం కావాలంటూ ప్లేట్లు విసిరికొట్టి.. సిబ్బందిపై గొడ‌వ‌కు దిగారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా […]

తబ్లీగీల ఓవ‌రాక్ష‌న్... మాంసాహారం కావాలంటూ..ప్లేట్లు విసిరికొట్టి
Ram Naramaneni
|

Updated on: Apr 27, 2020 | 10:24 AM

Share

తబ్లీగీ జమాత్​ సభ్యులు..ఓవ‌రాక్ష‌న్ తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇంత విపత్క‌ర ప‌రిస్థితుల్లో కూడా వారు దురుసు ప్రవర్తనను మార్చుకోవ‌డం లేదు. యూపీ​ కాన్పుర్​లోని రెండు హాస్పిట‌ల్స్ లో మెడిక‌ల్ స్టాఫ్ తో అసభ్యంగా ప్రవర్తించారు. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన‌ సుమారు 60 మంది తబ్లీగీలు.. స్థానిక హల్లెట్​ ఆసుపత్రి ఐసోలేషన్​ వార్డులో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మాంసాహారం కావాలంటూ ప్లేట్లు విసిరికొట్టి.. సిబ్బందిపై గొడ‌వ‌కు దిగారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు.

‘తబ్లీగీ జమాత్​ సభ్యులు.. భోజనం చేసేందుకు నిరాకరించడమే కాకుండా, మాంసాహారం​ కావాలని గొడ‌వ‌కు దిగారు. వార్డు బాయ్స్​తో అనుచితంగా ప్రవర్తించారు. ప్లేట్లు విసిరికొట్టారు’‌ అని జీఎస్​వీఎం వైద్య కళాశాల ప్రిన్సిపల్​ అండ్​ డీన్ డాక్ట‌ర్ ఆర్తి లాల్​చందని పేర్కొన్నారు. గతంలోనూ తబ్లీగీ సభ్యులు డాక్ట‌ర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. యూపీ​ నరేలాలో కొందరైతే ఏకంగా క్వారంటైన్​ గదుల ముందు మలవిసర్జన చేయడం వివాదాస్పదమైంది.

కాన్పుర్​లోని కాశీరామ్​ ఆసుపత్రిలోనూ కోవిడ్ బాధితులు రెచ్చిపోయారు. కొందరు​ రోగులు ఆసుపత్రి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ తరుణంలో రెచ్చిపోయిన బాధితులు ఘర్షణకు దిగి.. ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు.