AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్భయ కేసులో కీలక పరిణామం.. దోషి పవన్‌ గుప్తా పిటిషన్‌ కొట్టివేత

నిర్భయ కేసులో మరణ శిక్షను తప్పించుకునేందుకు దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్రపతి వారికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పటికే క్షమాభిక్ష, క్యూరేటివ్ పిటిషన్ లాంటి ఆఖరి అస్త్రాలు ముగిసిన నేపథ్యంలో దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా మరో పిటిషన్‌‌తో సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాడు. నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో తాను మైనర్‌ని అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. […]

నిర్భయ కేసులో కీలక పరిణామం.. దోషి పవన్‌ గుప్తా పిటిషన్‌ కొట్టివేత
Ram Naramaneni
|

Updated on: Jan 20, 2020 | 4:19 PM

Share

నిర్భయ కేసులో మరణ శిక్షను తప్పించుకునేందుకు దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్రపతి వారికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పటికే క్షమాభిక్ష, క్యూరేటివ్ పిటిషన్ లాంటి ఆఖరి అస్త్రాలు ముగిసిన నేపథ్యంలో దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా మరో పిటిషన్‌‌తో సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాడు. నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో తాను మైనర్‌ని అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

ముఖేష్ సింగ్ క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించిన తరువాత, తాజా వారెంట్ ప్రకారం, ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు నలుగురు నిందితులను ఉరి తీయనున్నారు. నిర్బయ ఘటన సమయంలో పవన్ మైనర్ అని చెప్పడానికి కీలక ఆధారాలు ఉన్నాయని అతని తరుపు లాయర్ ఏపీ సింగ్ కోర్టుకు విన్నవించారు. ఢిల్లీ హైకోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకు వెల్లడించారు. అయితే దోషి తరపు న్యాయవాది వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. అతడు మైనర్ కాదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం సమర్ధించింది. సమయాన్ని వృథా చేయడం కోసమే పదే, పదే పిటిషన్స్ వేస్తున్నారని, ఒకే అంశంపై ఇన్నిసార్లు పిటిషన్‌ దాఖలు చేయకూడదని పవన్‌ గుప్తా తరఫు న్యాయవాదిని ధర్మాసనం మందలించింది.