AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్​లైన్ క్లాసుల కోసం తండ్రి ఫోన్ కొనిస్తే..చివరకు

కరోనా పేద, మధ్యతరగతి ప్రజలకు తీసుకొచ్చిన కష్టాలు అన్నీ, ఇన్నీ కాదు. ఒకవైపు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు పిల్లల చదువులు వారి మెడకు గుదిబండగా మారాయి.

ఆన్​లైన్ క్లాసుల కోసం తండ్రి ఫోన్ కొనిస్తే..చివరకు
Ram Naramaneni
|

Updated on: Oct 04, 2020 | 4:54 PM

Share

కరోనా పేద, మధ్యతరగతి ప్రజలకు తీసుకొచ్చిన కష్టాలు అన్నీ, ఇన్నీ కాదు. ఒకవైపు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు పిల్లల చదువులు వారి మెడకు గుదిబండగా మారాయి. పాఠశాలలు ప్రారంభించే అవకాశం లేకపోవడంతో విద్యావిధానం ఆన్​లైన్​ ద్వారానే కొనసాగుతోంది. దీంతో తప్పనిసరిగా మొబైల్ ఫోన్స్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు ముందు నార్మల్ ఫోన్స్ తో ముందుకు నెట్టుకుపోయినవారు కూడా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ కొన్నారు. అయితే పిల్లలు చదువుల కోసం కాకుండా ​ గేమ్స్​ కోసం సదరు మొబైల్స్ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోని పక్కదారి కూడా  పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒడిశాలోని కియోంజర్​లో జరిగింది. (చిక్కిపోయిన కీర్తి, షాకవుతోన్న ఫ్యాన్స్)

జోడా పారిశ్రామిక నగరంలోని కమర్​జోడా మురికివాడకు చెందిన వినోద్​ అపాట్ అనే వ్యక్తి కొడుకు అమితాన్షు అపాట్(14).. సరస్వతి శిశు మందిర్​ స్కూల్​లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్​లైన్ క్లాసుల కోసం తన తండ్రి అతనికి రూ.13,000తో ఓ ఫోన్​ కొనిచ్చాడు. తరగతులకు హాజరవుతూనే ఫోన్‌ను మరో విధంగా ఉపయోగించిన అమితాన్షు ‘ఫ్రీ ఫైర్’​ గేమ్​కు బానిసయ్యాడు. ముందుగా తన తండ్రి బ్యాంకు  ఖాతా నుంచి.. గేమ్​లో ఉండే కొత్త ఫీచర్ల కోసం రూ. 35,000 కట్టాడు. తర్వాత తన తల్లి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 61,000 దాకా గేమ్​ కోసం ఖర్చు చేశాడు. ఈ విషయం తెలిస్తే తండ్రి తనను ఏమంటాడో అని భావించిన అమితాన్షు ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం తన తల్లి చీరతో బాత్​రూంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. (విజయవాడలో ప్రజల ప్రాణాలతో మటన్ మాఫియా చెలగాటం)

Follow Us