AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా బారినపడుతున్న ఉపాధ్యాయులు..!

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. పట్టణాలకే పరిమితమైన మహమ్మారి పల్లెపల్లెకు విస్తరిస్తోంది. మాకేం కాదన్న ధీమాతో ఉన్న వర్గాలు సైతం కొవిడ్ బారినపడుతున్నారు. ఇన్నిరోజులు కరోనా వారియర్లపై ప్రభావం చూపిన ఈ రాకాసి తాజాగా టీచర్లపై పంజా విసురుతోంది. తెలంగాణలో ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభమైన రెండు వారాల వ్యవధిలోనే 2,300 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డట్లు అంచనా.

కరోనా బారినపడుతున్న ఉపాధ్యాయులు..!
Balaraju Goud
|

Updated on: Sep 11, 2020 | 12:18 PM

Share

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. పట్టణాలకే పరిమితమైన మహమ్మారి పల్లెపల్లెకు విస్తరిస్తోంది. మాకేం కాదన్న ధీమాతో ఉన్న వర్గాలు సైతం కొవిడ్ బారినపడుతున్నారు. ఇన్నిరోజులు కరోనా వారియర్లపై ప్రభావం చూపిన ఈ రాకాసి తాజాగా టీచర్లపై పంజా విసురుతోంది. తెలంగాణలో ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభమైన రెండు వారాల వ్యవధిలోనే 2,300 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డట్లు అంచనా.

కరోనా ప్రభావంతో విద్యా సంస్థలు పూర్తిగా మూసివేశారు. విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్​ తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆగస్ట్​ 27 నుంచి ఉపాధ్యాయులను స్కూళ్లకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులను క్లాసులు వినేలా చూడాలని సూచించినప్పటికీ తర్వాత తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి పరిశీలించాలన్న షరతు కూడా విధించింది. ఆ రిపోర్ట్​ను రోజూ అధికారులకు ఉపాధ్యాయులు చేరవేయాల్సి ఉంటుంది. ఈ విధులు అప్పగించి కొద్దిరోజులకే టీచర్లు కూడా కరోనా బారిన పడుతున్నట్టు నిర్ధారణ అయ్యింది.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,300 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడినట్టు ఓ సర్వేలో తేలింది. ఈ గణంకాలను ఆయా జిల్లాల ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా ధ్రువీకరించారు. వీరిలో దీర్ఘకాల అనారోగ్య సమస్యలున్నవారు, 50 ఏళ్లు పైబడిన వారూ ఉన్నారు. హృద్రోగ, డయాబెటిస్​, డయాలసిస్​ సమస్యలున్న ఉపాధ్యాయులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. అయితే, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండటంతో స్కూళ్లకు వెళ్లకుండా.. విద్యార్థులను ఫోన్లలో మానిటరింగ్​ చేసే అవకాశం కల్వించాలని, పర్క్​ ఫ్రం హోం ఇవ్వాలని టీచర్లు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. దీంతో తాజాగా కరోనా సోకిన ఉపాధ్యాయుల వివరాలను ప్రభుత్వం సేకరించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ టీచర్లు కరోనా బారిన పడుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంతో మొరపెట్టుకున్నాయి. దీంతో సర్కార్ టీచర్లకు వర్క్‌ఫ్రంహోం సదుపాయం కల్పించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే టీచర్లకు ఈనెల 20 వరకు వర్క్‌ఫ్రంహోం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?