శ్రావణి కేసులో అసలు రహస్యం….

సీరియల్ నటి శ్రావణి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్టుతో అసలు భాగోతం బయటపడుతోంది.

శ్రావణి కేసులో అసలు రహస్యం....
Follow us

|

Updated on: Sep 18, 2020 | 6:00 PM

సీరియల్ నటి శ్రావణి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్టుతో అసలు భాగోతం బయటపడుతోంది. శ్రావణిని అశోక్‌రెడ్డి విపరీతంగా వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. 2017 నుంచి శ్రావణితో అశోక్‌రెడ్డికి పరిచయం ఉందని పోలీసులు గుర్తించారు. అశోక్‌రెడ్డి తీసిన ఆర్‌ఎక్స్‌ 100లో శ్రావణి గెస్ట్‌ రోల్‌లో నటించింది. శ్రావణిని అన్ని విధాలుగా అశోక్‌రెడ్డి వాడుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. శ్రావణి ఆర్థిక పరిస్థితిని అడ్డంపెట్టుకొని అశోక్‌రెడ్డి తరుచు వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. శ్రావణికి అవసరాన్ని బట్టి అశోక్‌ రెడ్డి ఆర్థికసాయం చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఆర్థికసాయం నెపంతో శ్రావణిపై అశోక్‌రెడ్డి జులుం ప్రదర్శించేవాడు. అంతేకాదు తనను కాదని ఎవరిని వివాహం చేసుకోవద్దని అశోక్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.

చివరగా, శ్రావణి చనిపోయినరోజు కూడా అశోక్‌రెడ్డి ఆమె ఇంటికొచ్చి.. కుటుంబసభ్యుల సమక్షంలోనే బెదిరింపులకు పాల్పడ్డట్లు చెబుతున్నారు. అదే సమయంలో శ్రావణి ఇంటికి సాయి కూడా వచ్చినట్లు సమాచారం. సాయి, అశోక్‌రెడ్డి ఇద్దరు కలిసి వేధింపులకు పాల్పడుతున్న విషయాన్ని ఆమె దేవరాజ్‌తో షేర్‌ చేసుకుంది. సాయి, అశోక్‌రెడ్డిలను దూరం చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని దేవరాజ్‌ కండీషన్ విధించాడు. దీంతో కొన్నాళ్ల నుంచి శ్రావణిని దేవరాజ్‌రెడ్డి దూరంపెట్టాడు. ముగ్గురు వేధింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.