AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలిసారి ఢిల్లీలో ల్యాండ్ అయిన షార్క్‌ చేపను పోలిన విమానం

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికులు బుధవారం ఓ వింత అనుభూతిని పొందారు. మరోవైపు కొందరు భయాందోళనతో కూడిన సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వారిలో ఆ అనుభూతి కలగడానికి కారణం మరేంటో కాదు.. ఓ పేద్ద షార్క్ చేపను పోలి ఉన్న విమానం ఢిల్లీ ఏయిర్ పోర్ట్‌లో ల్యాండ్ కావడమే. సముద్రంలో ఉండాల్సిన షార్క్ ఆకాశంలో చక్కర్లు కొడుతుండడాన్ని చూసిన ఢిల్లీ వాసులు తొలుత ఆశ్చర్యపోయారు. తర్వాత తేరుకుని అది విమానమని గ్రహించి ఆశ్చర్యపోయారు. ఇందుకు […]

తొలిసారి ఢిల్లీలో ల్యాండ్ అయిన షార్క్‌ చేపను పోలిన విమానం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 21, 2019 | 10:14 AM

Share

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికులు బుధవారం ఓ వింత అనుభూతిని పొందారు. మరోవైపు కొందరు భయాందోళనతో కూడిన సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వారిలో ఆ అనుభూతి కలగడానికి కారణం మరేంటో కాదు.. ఓ పేద్ద షార్క్ చేపను పోలి ఉన్న విమానం ఢిల్లీ ఏయిర్ పోర్ట్‌లో ల్యాండ్ కావడమే. సముద్రంలో ఉండాల్సిన షార్క్ ఆకాశంలో చక్కర్లు కొడుతుండడాన్ని చూసిన ఢిల్లీ వాసులు తొలుత ఆశ్చర్యపోయారు. తర్వాత తేరుకుని అది విమానమని గ్రహించి ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఢిల్లీ విమానాశ్రయం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

షార్క్ చేప ఆకారంలో ఉన్న ఎంబ్రాయర్ ఈ190-ఈ2 వాణిజ్య విమానం బుధవారం తొలిసారి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎయిర్‌పోర్టుల్లో ఒకటైన టిబెట్‌ లాషాలోని గోంగార్ ఎయిర్‌పోర్టులో గతేడాది షార్క్ ఆకారంలో ఉన్న విమానం లాండ్ అయింది. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చింది.